బాబాయ్ వైఎస్ వివేక కేసులో, దాదాపుగా 4 ఏళ్ళకు అబ్బాయ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ విచారణకు వెళ్తున్నారు. ఈ రోజు సిబిఐ విచారణకు హైదరాబాద్ వెళ్తున్నారు అవినాష్ రెడ్డి. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తున్నారు. ఈ విచారణ తరువాత అవినాష్ రెడ్డిని విడిచి పెడతారా , లేక అరెస్ట్ చేస్తారా అని రాష్ట్రం మొత్తం టెన్షన్ గా ఎదురు చూస్తున్న వేళ, అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐకి లేఖ రాసారు. ఈ రోజు విచారణకు వస్తున్నా అని, అయితే తన పైన ఒక వర్గం మీడియా, నా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, పనిగట్టుకుని, తనకు ఈ కేసులో సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని లేఖలో రాసారు. ఈ కేసు తప్పుదోవపట్టించేలా వారే వార్తలు రాసారని అన్నారు. అందుకే విచారణ చాలా పారదర్శకంగా సాగాలని, తనని న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, సిబిఐని అవినాష్ రెడ్డి కోరారు. తనకు ఏ పాపం తెలియదని, కేవలం మీడియానే ఈ కేసులో ఇరికించే విధంగా కధనాలు రాసింది అని అవినాష్ రెడ్డి అన్నారు. మరి సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read