ఏపీలో త‌ప్పుడు కేసులు బ‌నాయించి అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అని చూడ‌కుండా అరెస్టుల‌కి బ‌రితెగించే సీఐడీ,  క‌ళ్ల ఎదుటే హ‌త్య‌కేసు నిందితుడున్నా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేయ‌లేని నిస్స‌హాయ స్థితికి ఎవ‌రు కార‌ణం అనఏ చ‌ర్చ‌లు ఇప్పుడు సాగుతున్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి ఇంటి గోడలు దూకి, త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ అరెస్టు చేసిన సీఐడీ దారుణాలు వంద‌ల్లో ఉన్నాయి. సీఐడీ పెట్టిన కేసుల్లో చాలా కోర్టుల్లోనూ నిల‌బ‌డ‌లేదు. అటువంటి అక్ర‌మ‌కేసుల్లో థ‌ర్డ్ డిగ్రీ కూడా ప్ర‌యోగించిన సీఐడీ కోర్టులో దోషిగా నిల‌బ‌డినా తీరు మార‌లేదు. సొంత బాబాయ్‌ని చంపేసిన వైఎస్ వివేకానంద‌రెడ్డిని అరెస్టు చేయ‌డానికి మాత్రం సీబీఐ వీల్లేదంటోంది జ‌గ‌న్ రెడ్డి సైన్యం. సీబీఐ కూడా నిందితుడు అవినాష్ రెడ్డి చెప్పిన‌ట్ట‌ల్లా ఆడుతోందనే ఆరోప‌ణ‌లున్నాయి. సీబీఐయే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయ‌కుండా వెసులుబాట్లు క‌ల్పిస్తున్న‌ట్టు అనుమానాలు వ‌స్తున్నాయి. త‌ప్పు చేయ‌ని త‌మ‌పై సీఐడీని ఉసిగొల్పి త‌ప్పుడు కేసులు బ‌నాయించి, ఇంట్లో పిల్ల‌ల్ని సైతం బెదిరించి అరెస్టుల‌కి తెగ‌బ‌డిన తీరుపై టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ ప్ర‌శ్నించారు. మాకో న్యాయం, అవినాష్ రెడ్డికి ఓ న్యాయ‌మా అంటూ నిల‌దీశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read