అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణ కోసం, జగన్ మోహన్ రెడ్డి ఏ1 గా, విజయసాయి రెడ్డి ఏ2గా, మిగతా వారు , ప్రతి వారం నాంపల్లి సిబిఐ కోర్ట్ కు హాజరావుతున్నారు. ప్రతి శుక్రవారం వీరు సిబిఐ కోర్ట్ కు హాజరుకావాల్సి ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ఆయనకు ప్రతి శుక్రవారం వీలు కాకపోవటంతో, ఇప్పటి వరకు ఒక్క శుక్రవారం కూడా ఆయన సిబిఐ కోర్ట్ కు హాజరుకాలేదు. గత నాలుగు నెలలుగా ఒక్కసారి కూడా కోర్ట్ కు వెళ్ళకుండా, ప్రతి వారం మినహాయింపు అడుగుతూ వస్తున్నారు. అయితే, ప్రతి వారం ఇలా మినహాయింపు ఇవ్వాలి అంటే, కోర్ట్ ఏమంటుందో అని, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావటం కుదరదని, తన బదులు, ప్రతి వారం సిబిఐ కోర్ట్ కు, తన తరపున లాయర్ వస్తారాని, కావలసినప్పుడు తాను వ్యక్తిగతంగా హాజరు అవుతానాని, సిబిఐ కోర్ట్ ని కోరారు.

cbi 17102019 2

తాను ఇప్పుడు సియం అయ్యాను అని, అదీ కాక మా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రతి శుక్రవారం తాను హైదరాబాద్ రావాలి అంటే, తనతో పాటుగా బద్రతా సిబ్బంది వస్తారని, ఇది ఆర్ధికంగా బారం అని, అందుకే మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ పిటీషన్ పై, సిబిఐ, చాలా ఘాటుగా, అతి పెద్ద పిటీషన్ దాఖలు చేసింది. చట్టం ముందు, సియం అయినా, సామాన్యుడు అయినా ఒకటే అని కోర్ట్ కి చెప్పింది. అలాగే, జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే, సాక్షులను ప్రభావితం చేసారని, ఇప్పుడు ఆయన సియం అని, సాక్ష్యులని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పింది. అలాగే, ఇది వరకే, జగన్ మినహియింపు కోరారని, అప్పుడు హైకోర్ట్, ఆ పిటీషన్ కొట్టేసిందని, గుర్తు చేసింది.

cbi 17102019 3

అయితే ఇప్పుడు సియం అని అందుకే మినహియింపు ఇవ్వాలని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి చెప్పటం, సమంజసం కాదని, హైదరాబాద్ కి, విజయవాడకి పెద్ద దూరం లేదని, ఆయన రావటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆయన పనులు మిగతా రోజుల్లో చేసుకోవచ్చని, ఆ పిటీషన్ లో చెప్పింది. ఇలా చాలా ఘాటుగా, ఆ పిటీషన్ లో, సిబిఐ పేర్కొంది. అయితే ఈ పిటీషన్ రేపు, విచారణకు రానుంది. సిబిఐ తరుపున లాయర్లు గట్టిగా వాదనలు వినిపించనున్నారు. జగన్ తరుపు లాయర్లు మాత్రం, సియం అని చెప్పటం తప్ప, పెద్దగా వాదించటానికి ఏమి ఉండే అవకాసం లేదు. ఈ నేపధ్యంలో రేపటి విచారణ పై, ఉత్కంఠ నెలకొంది. జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే, సియం హోదాలో ఉంటూ, వారం వారం కోర్ట్ కు వెళ్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వైసిపీ కార్యకర్తలు భయపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read