తన పార్టీ సహచరుడి కోసం చంద్రబాబు ప్రత్యెక శ్రద్ద తీసుకున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి, క-రో-నా బారిన పడి హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి రెండు రోజుల నుంచి క్షీణించింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన, విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు తెలుసుకుని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రంగంలోకి దిగారు. సహచరుడి క్షేమ సమాచారం, వారి కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. పరిస్థితి విషమించిందని గమించిన చంద్రబాబు, అమెరికాలోని ప్రముఖ వైద్య బృందంతో, ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడించారు. విశాఖకు కంటే, హైదరాబాద్ నయం అని తలిచి, ఆయన కోసం ఒక ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అందుబాటులోకి వచ్చిన వెంటనే, సబ్బం హరిని హైదరాబాద్ తీసుకు రానున్నారు. మరో పక్క సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి పై ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా ఆరా తీసారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read