ఢిల్లీలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, మాయావతి, అఖిలేష్ యాదవ్ ను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించారు. ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలి... ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. అనే అంశాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు.

delhi 18052019

ఇటీవల రాహుల్‌ను చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో రాహుల్‌కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా. ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం.

 

delhi 18052019

ఎన్డీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు ఇంకా.. ఏఏ పార్టీల నేతలతో చర్చలు జరపాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు దాదాపు 6రోజుల ముందే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకి బలమైన ప్రత్యామ్నాయం రూపొందించి.. దానిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మే 23న ఫలితాల రోజు అంతా ఢిల్లీ చేరుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని భావిస్తున్నారు. కాగా, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు అనుభవం బీజేపీయేతర ఫ్రంట్‌ నిర్మాణానికి కలిసొస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, తెలుగుదేశం సహా 17 రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై మూడు నాలుగుసార్లు సమావేశమైనందువల్ల వారి మధ్య రాజకీయ ఐక్యత సాధ్యపడే అవకాశాలున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read