తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు సంక్రాంతి పండుగ వేడుకులకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది, ఆయన నారా వారి పల్లెకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం, తన కుటుంబ సభ్యులతో కలిసి, అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ఎన్నికలకు ముందు, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ మార్చం అని చెప్పి, ప్రజలను మభ్య పెట్టి, ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు రాజధాని మార్పు అంటున్నారని అన్నారు. జగన్ కు సవాల్ విసిరుతున్నా అని, అమరావతి రాజధానిగా ఉండదని, జగన్ మళ్ళీ ఎన్నికలకు వెళ్లి, గెలిచి, అప్పుడు రాజధాని మార్చుకోవాలని, అలా జరిగితే తాను కూడా ప్రజల తీర్పుని అంగీకరించి, రాజకీయాలు వదిలేస్తానని చాలెంజ్ చేసారు. అంతే కాదు, ఒక వేళ, జగన్ కు ఎన్నికలకు వెళ్ళటం భయం అయితే, రాజధాని పై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

cbn 15012020 2

ఈ రోజు చంద్రబాబు ప్రసంగం. "సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేను-ఎందుకంటే మన అందరికి ఇది కష్టాల సంక్రాంతి. ప్రతి ఏటా నారావారి పల్లె వెళ్లే వాళ్ళం. మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్ళం. ఈ సారి పండగ చేసుకోవడం లేదు. ఇది 29 గ్రామాల సమస్య కాదు- ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య. 29 గ్రామాల రైతులు త్యాగాలు చేశారు. సంక్రాంతి రోజు రైతులు, మహిళలతో ఉన్నాం. ప్రభుత్వం ఇష్టంమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. జగన్ ఓ మూర్ఖుడు అని చెప్తున్నాను. శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసారు. అధైర్యపడి ప్రాణ త్యాగాలు చెయ్యొద్దు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చాము. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ని చూడలేదు. కరుడు కట్టిన ఉగ్రవాది లా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇది ముంపు ప్రాంతం కాదు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందిఅని, మీ మీద కోపం చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వన్ని పర్మినేట్ బిల్డింగ్స్. రైతులు త్యాగాన్ని గుర్తించలేని స్థితిలో సీఎం వున్నారు. రాజధాని ఒకే సారి నిర్మించాలి. చట్ట ప్రకారం సీఆర్డీఏ ఏర్పాటు చేసి,నిర్మాణం మొదలు పెట్టాం. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళ. అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టాడు. పోలవరం పనులు ఆపేసి- రెండో కన్నుకుడా చంపేసాలా వున్నారు. అమరావతి కంటే ముందుగా కీయా మోటార్స్ వచ్చింది."

cbn 15012020 3

"ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే పోర్ట్స్ చాలా వున్నాయి. ఒకే ప్రాంతంపై నాకు అభిమానం కాదు- అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెదాలనేది నా కోరిక. .చాలా మంది భుములు ఇచ్చి గుండె పోటుతో మరణించారు. నాజీవితంలో ఎప్పుడు జోలె పట్టుకోలేదు. మీ కోసం జోలె పట్టుకున్నాను. ఎడ్ల పందెలకు వెళ్లే చొరవ ఉంది- రైతులు చాయిపోతే ఏమి పట్టడం లేదు. .ఎడ్ల పందేలు,కోడి పందేలు పేకాట లు ఆడుకువడంలో మంత్రులు బిజీగా వున్నారు. ఏ ఒక్క మంత్రికి రైతుల గోడు కనపడటం లేదు. మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. రైతులేమన్న ఉగ్రవాదులా..? వారిపై పోలీసుకు జులుం చూపిస్తున్నారు. విదేశాల్లో వుండే ఏపీ వాసులు ఇక్కడికి వచ్చేసేలా రాజధాని నిర్మాణం చేపట్టాం. అందరూ భూములు ఇచ్చే టప్పుడు సహకరించారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల ఐదుకోట్ల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడింది. ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకోము. ఈ ఏడాది కష్టాల సంక్రాంతి. ఇక్కడి రైతుల పోరాట ప్రతిమ రాష్ట్రంలో అందరూ చూసి నేర్చుకోవాలి. రాష్ట్రం మొత్తం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు చంద్రబాబు కు తెలిపారు. ఏక పక్షం గా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదు-చంద్రబాబు" అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read