సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక పోరుకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారం కోసం ప్రతిపక్షం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసిందని మండిపడ్డారు. అయినా అన్నింటినీ సమర్థంగా ఎదుర్కున్నామన్నారు. ప్రజాస్వామ్యం కోసం తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఎవరు ఎంత దుష్ర్పచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని స్పష్టం చేశారు. ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వచ్చేవని.. సార్వత్రిక ఎన్నికలు అవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వాటికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.

cbn 25042019

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదన్న చంద్రబాబు.. ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ సీఎం సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపరని, ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడితే మాత్రం నానా యాగీ చేస్తారని దుయ్యబట్టారు. ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందని సీఎం అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో... ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు మాత్రమే పని చేయాలన్నారు. మిగిలిన వాళ్లు ప్రభుత్వం కిందే పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరి పరిధిలో వారు పని చేయాలని.. ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ 1గా నిలిచామన్నారు.

cbn 25042019

అలాంటిది ఇప్పుడు ఈసీ రూపంలో... అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో... అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు... తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నిoపుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పోరాటాన్ని ఎవరు ఎలా ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదన్నారు. దుర్మార్గుడు అధికారంలోకి రావటానికి... ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్ధుల కుట్రలు ముగియలేదని.. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజేపీ కుట్రలు కొనసాగుతాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్ధుల ఓట్లలో తేడాలు ఉన్నాయని.. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read