గోదావరి నదిలో 77 మందితో వెళ్ళిన బోటు మునిగిన సంగతి తెలిసిందే. 51 మంది చనిపోగా, 26 మంది ఒడ్డుకుచేరారు. అయితే ఈ బోటు మునిగి దాదపుగా 38 రోజులు అయినా, ప్రభుత్వం ఈ బోటుని బయటకు తీయలేదు అనే విమర్సలు వచ్చాయి. ముఖ్యంగా 12 మంది ఆచూకీ దొరక్కపోవటంతో, ప్రభుత్వం పై మరింత విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వ, ధర్మాడి సత్యం బృందానికి, బోటు బయటకు తీసే పని అప్పగించింది. ధర్మాడి సత్యం బృందంతో పాటు, విశాఖ నుంచి వచ్చిన డీప్‌ వాటర్‌ డైవర్లు, నది లోపలికి దిగి బోటుకు ఇనుప తీగను కట్టి ఎట్టకేలకు బయటకు తీసారు. 38 రోజుల తరువాత బోటు బయటకు వచ్చింది. ధర్మాడి సత్యంతో, రూ.22 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోటుని బయటకు తియ్యటంతో, ధర్మాడి సత్యం బృందానికి ప్రశంసలు అందుతున్నాయి. ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు కూడా అభినందిస్తూ లేఖ రాసారు. ఇది లేఖ సారంశం.

dharmadi 23102019 2

గౌ|| ధర్మాడి సత్యం గారికి.. నమస్కారములు..బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న మీ తపన, మునిగిన పడవను బయటకు తియ్యాలన్న మీ పట్టుదల ప్రశంసనీయం. గోదావరిలో మునిగిన రాయిల్‌ వశిష్ట పడవను వెలికితీసేందుకు మీరు చూపిన తెగువ, చొరవ, పడిన శ్రమను అభినందిస్తున్నాను. పడవ వెలికితీత కోసం మీరు చూపిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా ప్రభుత్వం పెట్టి ఉంటే, ఈ దురవస్ధ బాధిత కుటుంబాలకు వాటిల్లేది కాదు. ఇన్ని ప్రాణాలు గోదాట్లో కలిసిపోయేవేకాదు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చలూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. పడవ వెలికితీతపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టపోయినప్పటికీ మీరు అధికారుల వెంటపడి మరీ పడవను బయటకు తీస్తానని ముందుకొచ్చిన విషయం పత్రికల్లో చూశాను.

dharmadi 23102019 3

మీ పట్టుదల సాయం చేయాలన్న తపన అభినందనీయం. బాధ్యతాయుతమైన మీ బృంద స్పూర్తి అందరిలో నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను. తమ వారిని కడసారి కూడా చూడలేమోనని కన్నీళ్లతో క్రుంగిపోయిన ఆప్తులకు మృతదేహాలను వెలికితీసి ఊరట కల్గించారు. తమ వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆత్మకు శాంతి కల్గించేందుకు మీరు, మీ బృందం దోహద పడ్డారు. ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చలూరు పడవ ప్రమాదాన్ని, బాధితుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేశారు. విపత్తులలో బాధితులను వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. కానీ మీరు కుటుంబాలను వదిలి, అన్న పానీయాలు మాని జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, వారి ఆప్తుల భౌతిక కాయాలను వారికి అప్పగించడం కోసం పడిన తపనను తెలుగుదేశం పార్టీ మనస్పూర్తిగా అభినందిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read