ఎన్నికల ప్రచారానికి తెదేపా సంసిద్ధమవుతోంది. అందుకు ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రచార రథాన్ని శనివారం గుంటూరు నగరం మణిపురం సమీపాన జయలక్ష్మి డిజైనర్స్‌ ఆవరణలో ప్రదర్శించారు. రోడ్‌షోలకు అనువుగా దీనిని తయారు చేశామని జయలక్ష్మి డిజైనర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్నీ నారయ్య చౌదరి వెల్లడించారు. త్వరలో ఈ వాహనాన్ని సీఎంకు అందజేస్తామన్నారు. ఈ వాహనంలో సీసీ కెమెరాలు, లైవ్‌ కెమెరాలతోపాటు తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వీడియో ప్రదర్శనకు హైడెఫినేషన్‌తో కూడిన ఎల్‌ఈడీ వాల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

radham 20012019

వాహనంలో అభ్యర్థ్ధితోపాటు 30 మంది ఉండొచ్చన్నారు. ఇవేకాకుండా సులువుగా ఎక్కేందుకు మెట్లు, కార్డ్‌లెస్‌ మైక్‌, 10వేల మెగావాట్ల సౌండ్‌బాక్స్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఎన్నికల ప్రచార రథాలను తయారు చేయడంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న గుంటూరులోని జయలక్ష్మీ మోటార్స్‌ ఈ పనుల్లోనే నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌తోపాటు మరో 25 మంది ఎంపీ అభ్యర్థులు వాహనాల తయారీ కోసం ఈ సంస్థకు ఆర్డర్లు ఇచ్చారు. జయలక్ష్మీ డిజైనర్స్‌ అధినేత నారయ్య చౌదరి ఆధ్వర్యంలో డిజైనర్‌ అట్లూరి ప్రసాద్‌ ఈ వాహనాల తయారీలో బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు కోసం భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేస్తుండగా.. టీడీపీ ప్రకాశం జిల్లా నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌ కోసం పూర్తి ఎలక్ర్టానిక్‌ ఎల్‌ఈడీ ప్రచార రథాన్ని తొలిసారి సిద్ధం చేస్తున్నారు.

radham 20012019

ఇవీ ప్రత్యేకతలు.. ఇప్పటి వరకు చిన్న చిన్న వాహనాలనే ప్రచార రథాలుగా సిద్ధం చేస్తున్న జయలక్ష్మీ డిజైనర్స్‌ తొలిసారిగా భారీ ఐషర్‌ వాహనాన్ని ప్రచార రథంగా సిద్ధ్దం చేసింది. ఈ వాహనానికి ఇరువైపులా నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల ఎత్తు కలిగిన ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వీడియోలను ప్రసారం చేయొచ్చు. వాహనానికి నాలుగు వైపులా అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్స్‌ ఉంటాయి. వాహనం చుట్టూ ఈ నాలుగున్నర ఏళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ పథకాల చిత్రాలను ముద్రించారు. వాహనం మీద ఉన్న వారికి కింద ఉన్నవారు రాత్రి వేళ సైతం స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్‌ఈడీ ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ స్ర్కీన్లకు, ఫ్లడ్‌ లైట్లకు విద్యుత్‌ అందించేందుకు అత్యంత సామర్థ్యం కలిగిన జనరేటర్‌ ఉంటుంది. వాహనంపైకి తేలిగ్గా ఎక్కేందుకు రెండు అంచెలుగా మెట్లు ఏర్పాటు చేశారు. వాహనంపై ఒకేసారి 25-30 మంది నిలబడేలా స్థలం ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read