ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయమంతా ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతోంది. ఫిబ్రవరి 22న ‘మహా నాయకుడు’ విడుదలవుతుండగా, మార్చి నెల మొదటి వారంలో రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై అటు సినీ రంగంతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా అత్యంత ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ రెండు చిత్రాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాంగోపాల్ వర్మ వైసీపీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌తో తెలిసిపోయింది.

lakshmintr 21022019

పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ, తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్‌ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు... ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువని, వారికి ఎన్టీఆర్‌ చరిత్రపై అవగాహన పెంచాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారుల దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై, రాంగోపాల్ వర్మపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కారణజన్ముడు అని, సినిమా, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను తెలుగుజాతి మరువదు అని కీర్తించారు.

lakshmintr 21022019

పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ సినిమా పై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పనికిమాలిన దర్శకుడు, ఒక పనికిమాలిన రాజకీయవేత్త డబ్బులుతో, తెలుగు ప్రజలు మాహనుభావుడిగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ ను కించ పరుస్తూ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, గతంలో జగన్ బావ బ్రదర్ అనిల్ తో, రాంగోపాల్ వర్మ, పార్క్ హయత్ హోటల్ లో చర్చలు జరిపిన విషయం కూడా తెలిసిందే. తరువాత సినిమా ముహూర్తం షాట్‌కు తిరుపతిలో వైసిపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రముఖ నేతల ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేసి, సినిమాకు మద్దతు తెలిపారు. ఈ పోస్టర్లలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజాతో సహా ఇతర నేతలను చిత్రించారు. ఒక మహానుభువడి చరిత్రని, ఇలా రాజకీయం కోసం వాడుకుంటున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read