తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు . పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలకు పాల్పడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. విద్యార్థుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు . ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు . పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను ఆశలను తుంచేయవద్దని విద్యార్థులకు సూచించారు.పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని చెప్పిన బాబు పరీక్షలు కేవలం ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని పేర్కొన్నారు. తమపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేయవద్దని విద్యార్థులను కోరారు చంద్రబాబు .

cbn reaction 24042019

‘పరీక్షల్లో తప్పామని తెలంగాణలో 16 మంది ఇంటరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణం నన్ను కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘విద్యార్థులకు నా విజ్ఞప్తి ఒక్కటే. పరీక్షల్లో పాస్‌ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే. పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. ప్రాణాలు అంతకంటే అమూల్యం’ అని పేర్కొన్నారు.

cbn reaction 24042019

‘దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. యువతరం దేశానికి తరగని సంపద. పరీక్షల్లో తప్పినంత మాత్రాన జీవితాలను అర్ధాంతరంగా ముగించకండి. మీపై పెట్టుకున్న కన్నవారి ఆశలను కడతేర్చి వారికి కడుపుకోత మిగల్చకండి’ అని సూచించారు. ‘మీ ముందు బంగారు భవిష్యత్తుంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే. ఓటమి విజయానికి తొలిమెట్టు’ అని పేర్కొన్నారు. ‘మంచి ఫలితాల కోసం మళ్లీ కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే. బంగారు భవిష్యత్తూ మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి మీరిచ్చే గొప్ప బహుమతి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read