తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో, ఆ పార్టీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై స్పందించారు. ముఖ్యంగా పోలవరం గురించి మాట్లాడుతూ, "రాష్ట్రానికి రెండు కళ్లను వైసిపి పొడిచేసింది. అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు. 13జిల్లాలను సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారు.22మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ప్రగల్భాలు ఏమయ్యాయి..? పోలవరం పూర్తి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దమనిషి వాటిగురించే ఎత్తడం లేదు. 22మంది వైసిపి ఎంపిలను తన స్వార్దానికి, కేసుల మాఫీకి జగన్ వాడుకుంటున్నాడు. దేశంలో ఇతర జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఉంది..? అదే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఎలా చేశాం..? పోలవరం నిర్మాణం 72% పూర్తయ్యింది అంటే పనుల పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్లే సాధ్యం అయ్యింది. దీనిపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి." అని అన్నారు. ఇదే విషయం పై, సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ "పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ 2 కేంద్రం ఆమోదం పొందేలా చేయడంలో వైసిపి విఫలం అయ్యింది. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు 7ఏళ్ల క్రితం అంచనాల ప్రకారం ధరలు చెల్లిస్తామని కేంద్రం అంటుంటే వైసిపి చోద్యం చూస్తోంది. వైసిపి అబద్దాల ప్రచారానికి పోలవరాన్ని బలిచేయడం బాధాకరం." అని అన్నారు.

ఇక వివిధ అంశాల పై చంద్రబాబు స్పందించారు. "కిలో ఉల్లి, క్యారెట్ ధరలు రూ 100 దాటిపోయాయి. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు, సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. కరెంటు బిల్లులు, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీఎత్తున పెంచేశారు. ఎక్కడికక్కడ జె ట్యాక్స్, లోకల్ ట్యాక్స్, వైసిపి ట్యాక్స్ లు దండుకుంటున్నారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య. సర్వేరాళ్లపై జగన్ రెడ్డి బొమ్మలు ఇంకో తుగ్లక్ చర్య. తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేశారు. వరదల్లో నష్టపోయిన రైతుల పరామర్శకు వైసిపి నాయకులు వెళ్లరు.. బాధితుల పరామర్శకు వెళ్లిన టిడిపి నాయకులపై కేసులు పెడతారు. గోదావరి జిల్లాలలో బాధితుల పరామర్శకు వెళ్లిన టిడిపి నేతలపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. సాయం చేయకపోగా రైతులపై వైసిపి తప్పుడు కేసులు హేయం. ప్రశాంతమైన కుప్పంలో కూడా వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. నిర్బంధం ఎంత పెరిగితే, వైసిపిపై ప్రజల్లో అంత వ్యతిరేకత. " అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read