దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దీక్ష హీట్ తగిలి, దానికి కవర్ అప్ ఇస్తూ, అమిత్ షా ఒక తప్పుడు లేఖ రాసారు. విభజన హామీల పై మాట్లాడకుండా, చంద్రబాబు పై రాజకీయ విమర్శలు ఆ లేఖలో రాసారు. ఈ సందర్భంగా అమిత్ షా ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు లేఖ రాశారన్నారు. అమిత్ షా మళ్లీ అసత్యాలు చెబుతున్నారన్నారు. హామీలు నెరవేర్చని ప్రధానికి ఎందుకు స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే మీపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం, అమిత్ షా, మోడీలకు లేదన్నారు. రాఫెల్ కుంభకోణంపై సమాధానం లేదని చెప్పారు. వాస్తవాలు చెబుతున్న మీడియాపై పగబడుతున్నారన్నారు. శ్రీకాకుళం వెళ్తే అమిత్ షాకు ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయన్నారు.

shah 12202019

ఇవి చంద్రబాబు మాటలు ‘అమిత్‌షా దుర్మార్గమైన లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలకలేదని ఆయన ఆవేదనకు గురవుతున్నారు. హామీలను అమలుచేయని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతారు? కక్షసాధింపు ప్రదర్శిస్తూ గౌరవం కోరుకుంటారా? మోదీ, అమిత్‌షా పచ్చి అబద్ధాలకోరులు. నేను యూటర్న్‌ తీసుకున్నానని అంటున్నారు. కాంగ్రెస్‌వాళ్లు చట్టంలో హోదా అంశం ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు హోదా కోసం డిమాండ్‌ చేసిన మీ పార్టీవాళ్లు నాడే ఎందుకు ఆ డిమాండ్‌ చేయలేదో అమిత్‌షా చెప్పాలి. నాడు రెండు పార్టీలు కలిసి బిల్లు ఆమోదించే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదే విషయాన్ని మన్మోహన్‌సింగ్‌ ఎన్నో వేదికలపై చెప్పారు. ఏపీలో ఏడు మండలాలను వారే కలిపామని చెప్పడం పచ్చి అబద్ధం. అదిచేస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని డిమాండ్‌ చేస్తే కలిపారు.

shah 12202019

'ధర్మపోరాట దీక్షకు జాతీయ స్థాయిలో కవరేజీ రాకుండా జాతీయ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. బోఫోర్స్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసినప్పుడు సంతోషించిన నాయకులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా రాస్తే బాధపడిపోతున్నారు. ఏపీ నుంచి కేంద్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. మేం ఇచ్చినదానికంటే మీనుంచి వచ్చింది తక్కువే. మీరు దాడిచేస్తే మేంకూడా దాడిచేస్తాం. ఎంతవరకైనా పోతాం. ఇప్పటికైనా పశ్చాత్తాపపడి సరిదిద్దుకోవాలి. మోదీ, షా చాలా భయంకరమైన వ్యక్తులు. ధర్మపోరాట సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి లేఖలు రాశారు. వాటినెవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. అమిత్‌షా శ్రీకాకుళం వెళ్తే ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయి. ఇప్పటికీ సిగ్గు పడకుండా దాడి చేస్తున్నారు. నేను ఎవ్వరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ వీరి చర్యల వల్ల ప్రజలంతా బాధపడుతున్నారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read