తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్ది సేపటి క్రితం ఆయన ట్విట్టర్ లో స్వయంగా ఈ విషయం చెప్పారు. ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారు అందరూ వెంటనే టెస్ట్ చేయించుకోవాలని కోరారు. స్వల్ప లక్షణాలున్నట్లు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. ఆయన కుమారుడు లోకేష్ కి కూడా నిన్న పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత చంద్రబాబు టెస్ట్ చేయించుకోగా ఆయనకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయని కోరారు. మొన్న చంద్రబాబు గుంటూరు జిల్లా మాచర్ల వెళ్లి, అక్కడ స్వయంగా పాడె మోశారు. అక్కడే చాలా సేపు ఉండటం, ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉండటంతో, అక్కడే ఆయనకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read