ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఈ రోజు రాళ్ళ దా-డి జరిగింది. తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచార్మలో ఉన్న చంద్రబాబు పై, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయబోయారు. అయితే అవి పక్కన ఉన్న వారి పై పడ్డాయి. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. దెబ్బతగిలిన యువకున్ని తన వాహనంపై తీసుకొచ్చిన చంద్రబాబు మాట్లాడించారు. దీంతో సభకు పోలీసులు రక్షణ కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రచార వాహనం దిగి, రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న నాకు రక్షణ కల్పించకకపోతే సామాన్యులకు ఏమి కల్పిస్తారని ప్రశ్నించారు. కొద్ది సేపు ధర్నా చేసిన తరువాత, ఎస్పీ కార్యాలయం వరకు చంద్రబాబు ర్యాలీగా బయలు దేరారు. కృష్ణాపురం ఠాణా కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే విషయం తెలుకున్న ఎస్పీ, ఆమె స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read