ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సోమవారం విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మార్చ్ 20న ఆయన హైదరాబాద్ వెళ్ళటం, తరువాత వరుసగా, నాలుగు లాక్ డౌన్లు కేంద్ర ప్రభుత్వం విధించటంతో చంద్రబాబు, హైదరాబాద్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని వైపులా ఆంక్షలు సడలించటం, అలాగే డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కు కూడా అనుమతి ఇవ్వటంతో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రావటానికి నిర్ణయం తీసుకుని, ఇరు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా డీజీపీలకు పర్మిషన్ కోరారు. అయితే తెలంగాణా డీజీపీ కార్యాలయం వెంటనే పర్మిషన్ ఇవ్వగా, ఇంకా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి చంద్రబాబుకు అనుమతి రాలేదు.

అయితే ఇదే క్రమంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డీజీపీకు కూడా లెటర్ రాసారు. సోమవారం ఉదయం విశాఖ పర్యటనకు వెళ్తానని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలని, ఏపి డిజిపిని చంద్రబాబు కోరారు. సోమవారం ఉదయం 10.35గంకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు, అక్కడ నుంచి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి బాధితులకు చంద్రబాబు పరామర్శించనున్నారు. అనంతరం అదే రోజు విశాఖనుంచి రోడ్డుమార్గంలో అమరావతికి చంద్రబాబు రానున్నారు. విశాఖ నుంచి ఉండవల్లిలోని తన ఇంటికి రావటానికి కూడా, ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపి డిజిపికి చంద్రబాబు లేఖ రాసారు. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజునే, చంద్రబాబు కేంద్రాన్ని అనుమతి కోరారు.

అయితే అప్పట్లో, లాక్ డౌన్ ఉదృతంగా ఉండటంతో, అనుమతి రాలేదు. ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు కేంద్రం, రాష్ట్రాలకు అధికారం ఇవ్వటంతో చంద్రబాబు, రాష్ట్రాలకు పర్మిషన్ ఇవ్వమని కోరారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారు అంటూ వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. హైదరాబాద్ లో ఉన్నా, చంద్రబాబు కరోనా పై, ఎప్పటికప్పుడు, ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపి వారిని ఆదుకోవటంలో చొరవ చూపించారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్తూ వచ్చారు. అలాగే ఒక ఫోరం ఏర్పాటు చేసి, కేంద్రానికి కరోనా పై, అలాగే దేశ ఆర్ధిక పరిస్థితి పై కేంద్రానికి సలహాలు పంపించటం, కేంద్రం వాటిని ప్రశంసిస్తూ, లేఖ రాసిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read