చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, గొనుగునూరు గ్రామ పంచాయతీ పేటగుట్టలో సుబ్రమణ్య స్వామీ విగ్రహాల ద్వంసం పై రాష్ట్ర డిజిపి కి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. "జూన్ 2019 నుండి రాష్ట్రంలో ప్రార్ధనా స్థలాలపై దా-డు-లు పెరిగిపోయాయి. తాజాగా పేట్టగుట్టలో సుబ్రమణ్య స్వామీ దేవాలయంలోని విగ్రహాలు ద్వసం చేయబడ్డాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలో అసాంఘీక శక్తులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు నేరస్తులను పట్టుకోకుండా న్యాయం చేయాలని కోరుతున్న తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఏప్రిల్ 6, 2021 న పోలీసులు 40 మంది టిడిపి నాయకులను అరెస్టు చేసి కనీసం తిండి కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ త్రిప్పుతున్నారు.నిన్న అర్ధరాత్రి పోలీసులు వారికి సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేశారు. అరెస్టు చేసిన మొత్తం 40 మంది నాలుగు గ్రామాలకు చెందిన గౌరవ మాజీ సర్పంచ్ లు, ఎంపీటిసి అభ్యర్ధులు ఉన్నారు. సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయడం అర్ధరహితం, కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నం.69/2021 నమోదు చేయటం అన్యాయం. జరుగుతున్న పరిణామలను తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తెదేపా నాయకులపై సైతం కేసులు పెట్టారు. న్యాయం కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం కలోనియల్ వలస పాలనను తలపిస్తుంది.

dgp 07042021 2

"ఈ రోజు 07.04.2021 న మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ మాజీ డైరక్టర్ సత్యేంద్ర శేఖర్, కుప్పం అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ మరియు కాణిపాకం వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు." ఆశ్చర్యకరంగా ఎప్.ఐ.ఆర్.నం.69/2021 కుప్పం పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయగా... అదుపులోకి తీసుకున్న ముగ్గురు నాయకులను గుడుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఒక వర్గం పోలీసులు అధికార వైసీపీతో కుమ్మక్కై రాజకీయ కక్షసాధింపుతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తవేసి నిజమైన నేరస్తులను పట్టుకోవాలి. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న కొంత మంది పోలీసులు అధికారులపై విచారణకు ఆదేశించాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రార్ధనా స్థలాలకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలి. పెట్టీ రాజకీయాలకు అతీతంగా పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడే రాష్ట్రంలోని ప్రార్ధనా స్థలాలలై దాడులు ఆగుతాయి. ప్రజలలో పోలీసులపై నమ్మకం కలుగుతుంది."

Advertisements

Advertisements

Latest Articles

Most Read