ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా జరీ చేసిన బిల్లులుకు సంబంధించి, దాంట్లో రీయింబర్స్ చేస్తామని కేంద్రం సమాధానం చెప్పి, ఆ తరువాత నిధులు ఇవ్వటం లేదు అనే విషయాన్ని తాపీగా చెప్పింది. ముఖ్యంగా పోలవరంలో ఆశించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయటం లేదని, కాంక్రీట్ పనులు కూడా చేయటం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. ఇదే అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా, చేపట్టిన పనులకు సంబంధించి 730 కోట్ల రూపాయాలు రీయింబర్స్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు పంపించింది. అయితే ఇందులో తొలి విడతగా, 320 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటమే కాకుండా, ఏ ఎకౌంటు లో వేయాలో, ఎకౌంటు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, పోలవరానికి చెందిన ఖాతా నంబర్ కాకుండా, వేరే ఎకౌంటు నెంబర్ ఇవ్వటంతోనే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. దీనికి తోడుగా , పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వెళ్ళిన బిల్లులకు సంబంధించి, 320 కోట్లు మాత్రమే విడుదల చేయాలని భావించారు.

polavarma 19012022 2

అయితే ఆ మేరకు పనులు అక్కడ చేయటం లేదని, అక్కడ కనపడటం లేదని, కేంద్రం గుర్తించి ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే, ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకపోవటం, అలాగే ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకోవటం , ఈ రెండు పరిణామాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా, ప్రాజెక్ట్ అధికారులు కూడా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కేంద్రం తాను ఎందుకు, ఈ నిర్ణయం తీసుకుంది కూడా స్పష్టంగా పేర్కొంది. నిర్ణీత వ్యవధిలో, ఆశించిన మేరకు పనులు చేయకుండా ఉండటమే, దీనికి కారణం అని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కొర్రీ పెడుతూనే ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయటంలో విఫలం అవుతూ వస్తుంది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏమి చేస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read