ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖా కార్యదర్శి, విదేశీ ఆర్ధిక శాఖల నుంచి వచ్చే రుణాలకు సంభందించి అడ్వాన్సు పంపించాలని కేంద్ర ఆర్ధిక శాఖకు రాసిన లేఖ పై కేంద్ర ప్రభుత్వం మండిపడింది . రాష్ట్ర ఆర్దికశాఖ కార్యదర్శికి కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి, ఇటువంటి ఎడ్జెస్ట్ మెంట్లు, అడ్వాన్సులు ఇవ్వటం కుదరని లేఖలో తేల్చి చెప్పింది. అదే విధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ల నుంచి తీసుకున్న 500 కోట్ల రుణానికి సంబంధించి లెక్కలు చెప్పాలని కూడా అక్షింతలు వేసింది. ఈ డబ్బులను ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ కు వాడకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం పట్ల  కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే విధంగా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రావాల్సిన రుణానికి సంబంధించి కూడా పలు షరతులు విధించింది. ఇటువంటి షరతుల కూడిన కేంద్ర ప్రబుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ నుంచి వచ్చిన లేఖతో దాదాపుగా 8 వేల కోట్ల రుణం నిలిచిపోయే అవకాసం ఉంది. ఈ ఘాటు లేఖతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అధికారులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఒకవేళ ఈ 8 వేల కోట్ల రుణం నిలిచిపోతే  ఏం చెయ్యాలో కూడా అర్ధం కాక ఆర్ధిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read