ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన చిచ్చు, వేరే రాష్ట్రాలకు అంటుకోకుండా, పెట్టుబడిదారులకు భరోసా ఇస్తూ, అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు పంపింది. సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో కుదుర్చుకున్న పీపీఏల విషయంలో, చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, ఆ ఒప్పందాల పై మళ్ళీ సమీక్ష చేస్తాం అంటూ, అందప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన అప్పట్లో సంచలనంగా మారింది. అటు కోర్ట్ లు, ఇటు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని త్పపుబట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చర్యతో, దేశ వ్యాప్తంగా పెట్టుబడి పెట్టిన, పెట్టుబడి దారులు కొంత, అబధ్రతాభావానికి లోనవవ్వటంతో, కేంద్రం వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా, టెక్నికల్ అంశాలు సాకుగా చూపిస్తూ, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే సంస్థలను ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తూ, కేంద్రం ప్రభుత్వం, ఒక అడ్వైజరీ జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు పెట్టుబడి దారులను ఇబ్బంది పెట్టటం కుదరదు.

power 10112019 2

కేంద్రం జరీ చేసిన ఉత్తర్వులు ప్రకారం, రాష్ట్రాలు, కేవలం విద్యుత్ కొనుగోళ్ళు వరుకే పరిమితం అవ్వాలని, అలా కాకుండా ఆ ఉత్పత్తి దారుల ప్లాంట్లు జోలికి వెళ్తే కుదరదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల ప్రకారం, ఆయా కంపెనీలు, విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, సరఫరా చేసే విధంగా, వారికి వీలుగా, డైరెక్టు కరెంటు (డీసీ) విద్యుత్తు సామర్థ్యం పెంచుకోనే క్రమంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అడ్డు పడుతున్నాయని, అలా చెయ్యకూడదు అంటూ ఆ చర్యలను కేంద్రం తప్పుబట్టింది. సోలార్ కంపెనీలు, వాటి సామర్ధ్యాన్ని పెంచుకుంటూ, వారికి కేటాయించిన ప్లాంట్లలో, అదనపు డైరెక్ట్‌ కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛను ఆ కంపెనీలకు వదిలి పెట్టాలని, రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

power 10112019 3

రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న విధ్యుత్ ఒప్పందాలు ప్రకారం, వాటికి లోబడి, ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని ఎంత పెంచుకున్నా, రాష్ట్రాలు అడ్డుపడడానికి వీల్లేదని పేర్కొంది. దీని కోసం, అదనపు లైసెన్సులు అవసరం లేదని, ఎవరైనా ఇష్టం వచ్చినంత సామర్ధ్యం ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, ఎవరికైనా విక్రయించే స్వేఛ్చ ఉంది అంటూ, కేంద్రం తెలిపింది. కేంద్రం ఇచ్చిన సర్కులర్ మేరకు, ఒప్పందాల ప్రకారం, విద్యుత్ ఉత్పతి చెయ్యకపోతే, వారు ప్రభుత్వానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది కాబట్టి, ప్రభుత్వాలు వారికి అడ్డు పడటానికి వీలు లేదు, ఇలా ఎక్కువ విద్యుత్ ని ఉత్పత్తి చేసుకోవటం, ఒప్పంద ఉల్లంఘన కిందకు రాదు, దీని వల్ల కొనుగోలుదారుల పై కూడా అదనపు భారం ఉండదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో జోక్యం చేసుకోకూడదు అంటూ కేంద్రం తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read