జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత మూడు నెలలుగా సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా, రేపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, చలో పల్నాడుకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, చంద్రబాబు వంకగా కాకుండా, అక్కడ మొహరం, వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలు జరుగుతాయని చెప్తూ, 144 సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ రేపు ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా, 144 సెక్షన్ పెట్టారని, చంద్రబాబు కూడా ఆరోపించారు. మతాలకు, రాజకీయానికి సంబంధం పెట్టి, పోలీసులు వ్యవహిరిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు, ఒక్క పల్నాడుకు మాత్రమే కాదని, రాష్ట్రం మొత్తం ఇలాంటి సమస్యే ఉందని అన్నారు. పల్నాడులో మరింత ఎక్కువగా ఉంది కాబట్టి, ఇది హైలైట్ చేసామని అన్నారు. తెలుగుదేశం పోరాటం చూసి, ఇక్కడకు వచ్చి, కేవలం పల్నాడులో టిడిపి నేతల ఇబ్బందులు గురించి చూస్తాం అంటున్నారని, మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు గురించి ఏమి చెప్తారని ప్రశ్నించారు.

atmakru 1009 2019 2

జగన మోహన్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యామని, వీళ్ళ అరాచకాలు ఇంకా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, చూసుకుందాం అంటూ, రేపు తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు పల్నాడు రావాలని పిలుపిచ్చారు. బాధితులను ఆదుకోమంటే, వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, ఏకంగా హోం మంత్రే అవమానిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అక్కడ బాధితులు అందరికీ న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసేది లేదని, దేనికైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. రేపటి చలో ఆత్మకూరుని అడ్డుకోవటానికి, వైసీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని, వ్యవస్థలను ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తారని, దేనికైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఒక వేళ, వాళ్ళు అడ్డుకుంటే, ఎక్కడికక్కడే ధర్నాలు చెయ్యాలని చంద్రబాబు పిలుపిచ్చారు. 110 రోజులుగా గ్రామాలకు దూరంగా బ్రతుకుతుంటే, ఈ ముఖ్యమంత్రికి, ఈ డీజీపీకి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.

atmakru 1009 2019 3

పండుగల పేరుతొ 144 సెక్షన్ పెట్టి, అసత్యాలు చెప్తున్నారని అన్నారు. బాధితులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేయాలని, ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తమ ఇంటికి తాము వెళ్తున్నామని, తమకు అండగా అందరూ ఉండాలని... తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కావాలని బాధితులు అడుగుతున్నారని, అందుకే టీడీపీ నాయకత్వం మొత్తం వారికి అండగా నిలుస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నేతలపై అక్రమంగా 565 కేసులు నమోదు చేశారు. ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా నిలబెట్టేవరకు వదిలిపెట్టేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరించారు. ఇక మరో పక్క పోలీసుల హెచ్చరికలు, ప్రభుత్వం ఎత్తులతో, రేపటి చలో ఆత్మకూరులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురుఅవుతాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read