తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పటుగా, అప్పట్లో మంత్రిగా పని చేసిన నారాయణతో పాటుగా, మొత్తం 14 మంది పై, నిన్న జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. సిఐడి నమోదు చేసిన ఈ కేసులో భాగంగా, సిఐడి అధికారులు హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు, నారాయణ కాకుండా, ఈ కేసుల్లో ఉన్న మిగతా వారి ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో సిఐడి ఉంది. సిఐడి అధికారుల బృందం, ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబు, ఏ2గా ఉన్న నారాయణను మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటూ పుకార్లు వస్తున్నాయి. ముఖ్యంగా బ్లూ మీడియాలో ఈ లీకులు ఇస్తున్నారు. నారాయాణకు ఈ రోజు ఉదయం చిత్తూరు కోర్టు, రిమాండ్ ని తిరస్కరించింది. ఆయన పై ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు తిరస్కరించింది. అయితే నారాయణకు ఆ కేసులో బెయిల్ రాగానే, సిఐడి కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ, ప్రచారం జరిగింది. అయితే బెయిల్ వచ్చిన వెంటనే, నారాయణ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన ఈ రోజు కుప్పం పర్యటనకు వస్తున్నారు. హైదరాబద్ నుంచి కుప్పం రానున్నారు. అయితే చంద్రబాబుకి ఈ లోపే నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ, న్యాయ నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. ఈ కేసులో నోటీసులు ఇవ్వకుండా, అదుపులోకి తీసుకొచ్చారని చెప్తున్నారు.

cbn 11052022 2

చంద్రబాబు పై పెట్టిన కేసులో, పదేళ్ళకు పైగా శిక్ష పడే సెక్షన్ లు కావటంతో, నోటీసులు ఇవ్వనవసరం లేదని, నేరుగా అరెస్ట్ చేయవచ్చు అని చెప్తున్నారు. అయతే చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత, ప్రతిపక్ష నేత కావటంతో, అయనకు నోటీసులు ఇచ్చే చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే జగన్ విఖరి తెలిసిన వాళ్ళు మాత్రం, నోటీసులు ఇవ్వకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, వీటిని లెక్క చేసే పనిలేదని, ఏదైతే అది అవుతుందని, అరెస్ట్ చేసే చేసుకోనివ్వండి అంటూ, కుప్పం పర్యటనకు బయలుదేరారు. తప్పు చేయనప్పుడు, వీళ్ళకు భయపడేది ఏంటి అంటూ చంద్రబాబు మొండిగా, ఈ రోజు పర్యటనకు వస్తున్నారు. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఏమి జరుగుతంది అనేది చూడాల్సి ఉంది. అసలు భూసేకరణ, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో, కేసు పెట్టటమే ఒక కామెడీ అని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read