తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు అయుదు రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్ధులను అభినందించారు. ముఖ్యంగా మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్‌లకు స్వయంగా ఫోన్ చేసి మరీ చంద్రబాబు, శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఉద్దేశించి ట్వీట్ కూడా చేసారు. అలాగే అస్సాం, పాండిచేరీలో గెలిచిన అభ్యర్ధులకు కూడా చంద్రబాబు అభినందనలు చెప్తూ త్వీట్ చేసారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో, 292 సీట్లకు గాను, టిఎంసి 182 గెలవగా, మరో 33 ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ, 54 గెలవగా, మరో 21 ఆధిక్యంలో ఉంది. ఇక తమిళనాడులో, 234 సీట్లకు గాను, డీఎంకే 93 గెలవగా, మరో 64  ఆధిక్యంలో ఉంది. అలాగే ఏడీఎంకే , 37 గెలవగా, మరో 40 ఆధిక్యంలో ఉంది. కేరళలో 140 సీట్లకు గాను, ఎల్డీఎఫ్ 03 ఆధిక్యంలో ఉండగా, 96 గెలిచారు. అలాగే యూడీఎఫ్ 41 గెలిచింది. వీరందరికీ చంద్రబాబు ఫోన్ చేసి, అభినంధనలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read