ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాసారు. చంద్రబాబు నిన్న కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్వల్ప లక్షణాలతో తాను కోవిడ్ బారిన పడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ, అనేక మంది దేశ వ్యాప్తంగా, ఆయనకు విషెస్ పంపించారు. ఈ రోజు ఉదయం చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాసారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ సున్ వెయిడాంగ్ లేఖలో ఆకాంక్షంచారు చైనా రాయబారి. చంద్రబాబు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ చైనా రాయబారి లేఖ రాసారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు స్థాయి ఇది అంటూ, టిడిపి శ్రేణులు పోస్ట్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నా, లేకపోయనా, చంద్రబాబుకు ఎప్పుడూ దేశ వ్యాప్తంగా గౌరవం ఉంటుందని పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read