చంద్రబాబు వ్యవహార శైలి పై, గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక విమర్శలు వస్తూ ఉండేవి. అవి మంచి చేసేవే అయినా, చంద్రబాబు నిర్ణయాలు పార్టీలో చాలా మందికి నచ్చేవి కాదు. ముఖ్యంగా చంద్రబాబు, ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే, ఆయన తీసుకునే సమయం, నాన్చే విధానంతో, టిడిపి శ్రేణులు విసుగెత్తిపోయేవి. ముఖ్యంగా ఏదైనా సమస్య జటిలం అవుతుంటే, దాన్ని మరింత జటిలం చేసేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉండేది. అయితే విమర్శలు నుంచి , పాఠాలు నేర్చుకుని, మారే వాడే నాయకుడు. చంద్రబాబు అలాంటి వారు కాబట్టే, ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మొన్నటి మ్యానిఫెస్టో పెద్ద షాక్. ఇంత ప్రిపెరేడ్ గా చంద్రబాబు ఎన్నికలకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక సీట్ల విషయంలో కూడా తేల్చి పడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరించింది. సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేసారు. అయితే ఇక్కడ కోడెల శివరాం ఉన్న సంగతి తెలిసిందే. సహజంగా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాన్చుతూ, చివరి వరకు తేల్చే వారు కాదు. ఎన్నికల పది రోజులు ముందు క్లారిటీ ఇచ్చే వారు. అయితే ఇప్పుడు మాత్రం ఏడాది ముందే తేల్చేసారు. కోడెల శివరాంని ఎలా సముదాయిస్తారు అనేది పక్కన పెడితే, అంబటికి మాత్రం కన్నా సరైన పోటీ అని, అంబటి ఓడిపోవటం ఖాయం అని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read