ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చింతామణి నాటకాన్ని నిషేధించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్య వైశ్యులు దీని పై అభ్యంతరం చెప్పారని, అందుకే చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేదిస్తున్నామని ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న జవాబు. అసలు చింతామణి నాటకం పైన ఆర్య వైశ్యులకు ఏమి ఇబ్బంది ? ఇప్పటి వరకు వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి, ఇప్పుడు ఈ నిర్ణయం పై ఏమి జరుగుతుంది అనే చర్చ మొదలైంది. అయితే మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్య వైశ్యులు కోపంగా ఉన్నారు. దానికి ఆజ్యం పోస్టు సుబ్బారావు గుప్తా ఘటన వారికి మరింత కోపాన్ని తెప్పించింది. అలాగే రోశయ్య మరణం పైన జగన్ వ్యవహరించిన తీరు కూడా, ఆర్య వైశ్యులు కోపానికి కారణం అయ్యింది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఆర్య వైశ్యులను మచ్చిక చేసుకోవటానికి ప్రభుత్వం ఈ ప్లాన్ వేసింది అనే ప్రచారం జరుగుతుంది. దీని పై ఆర్య వైశ్యులు కొంత మంది స్పందించారు. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అని, ఎప్పుడో మర్చిపోయిన చింతామణి నాటకాన్ని, మళ్ళీ మేమేదో చేసామని వైసీపీ ప్రభుత్వం నాటకం అడుతుందని, అసలు ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకో అర్ధం కావటం లేదని అంటున్నారు.

jagan 18012022 2

జగన్ ఎంత చేసినా, ఆర్య వైశ్యులకు జగన్ చేసిన ద్రోహం మర్చిపోమని, మాకు ఇవన్నీ కాదని, తమ పైన జరుగుతున్న దా-డు-లు, అణిచివేత ఇవన్నీ ఆపాలని అన్నారు. గతంలో ఉన్న వైశ్య కార్పొరేషన్ ని , అప్పటి కంటే, బాగా పని చేసే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు గౌరవం కావాలని, అంతే కాని తమను పావులుగా వాడుకుని, ఇలా డైవర్ట్ చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. చిత్తసుద్ధి ఉంటే, చింతామణి నాటకాన్ని youtube నుంచి కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోశయ్య పైన జగన్ వ్యవహరించిన తీరు, సుబ్బారావు గుప్తా పైన జరిగిన దా-డి, వీటి అన్నిటితో వైశ్యులు ఆగ్రహంగా ఉన్నారని, అందుకే వైశ్య మహా సభలు కూడా పెట్టి, ప్రభుత్వ తీరుని ఎండగట్టటంతో, వైశ్యులలో వ్యతిరేకత పెరిగిపోయిందని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో, ఏదో చేసామని, ఉద్దరించామని చెప్పుకోవటానికి మాత్రమే, ప్రభుత్వం ఈ విధంగా తమను మభ్య పెడుతుందని వైశ్యులు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read