జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పై ప్రతి రోజు రాజధాని రచ్చబండ పేరుతో, ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను చీల్చి చెండాడుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటికి ఏపి సిఐడి అధికారులు వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణం రాజు ఇంటికి, సిఐడి అధికారులు వచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చి , ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రఘురామరాజు పై, ఏపిలో వైసిపీ శ్రేణులు ఏడు కేసులు పెట్టారు. ఏ కేసులో ఇప్పుడు విచారణ కోసం, లేదా అరెస్ట్ కోసం పోలీసులు ఎందుకు వచ్చారో అర్ధం కావటం లేదు. మొత్తంగా 25 మంది సిఐడి పోలీసులు రఘురామకృష్ణం రాజు ఇంటికి వచ్చారని, ఆయన్ను అరెస్ట్ చేయటానికి లోపలకు వెళ్లారు. అయితే లోపల ఆయన్ను లిఫ్ట్ చేయటానికి ప్రయత్నం చేయగా, ఆయనకు ఉన్న సెంట్రల్ ఫోర్సు అడ్డుకుంది. ఇప్పటికే ఏపి పోలీసులు పై నమ్మకం లేదని, ఇప్పటికే ఆయన సెంట్రల్ ఫోర్సెస్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా లోపల సస్పెన్స్ కొనసాగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read