ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కట్టడిలో విఫలం అయ్యిందని అందరికీ తెలిసిందే. నమోదు అవుతున్న సంఖ్య చూస్తూనే ఆ విషయం అర్ధం అవుతుంది. ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తరువాత స్థానం మనదే. అయితే మనకు ఇప్పుడు కేసులు 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలకే అమ్మో అని అనుకుంటున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, పెద్ద సిటీలు లేవు, అయినా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు క-రో-నా పాకేసింది. ఇక మరణాల్లో కూడా మనది 5 వ స్థానం. ఇలా ఏది చూసుకున్నా, ఏపిలో క-రో-నా అధికంగా ఉందని ప్రజలు భయపడే పరిస్థితి. అయితే తాజాగా వచ్చిన సర్వే వివరాలు చూస్తూ, అవాక్కవ్వల్సిందే. ఒక పక్క షాక్ అవుతూనే, మరో పక్క ఈ వైరస్ ఇంత ప్రమాదం కాదా అనుకునే సందేహం కూడా మానదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిరో సర్వైలెన్స్‌ నిర్వహించిన సర్వేలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19.7 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లిపోయినట్టు తేలింది. 9 జిల్లాల్లో చేసిన సర్వేలో ఈ విషయం బయట పడింది.

అంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 19.7 శాతం అంటే, దాదాపుగా కోటి మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే వారికి కూడా వారు ఈ వైరస్ బారిన పడినట్టు తెలియదు. అంతే కాదు క-రో-నా లక్ష్యనాలు కూడా అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు క-రో-నా టెస్టులు చేయించుకోని వారిని ఎంపిక చేసి ఈ సర్వే చేసారు. నెల రోజులు క్రితం మూడు జిల్లాల్లో ఈ సర్వే చెయ్యగా, 15.7 శాతం మందికి క-రో-నా విచ్చి వెళ్లిందని తేలింది, తాజగా మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా సర్వే చేసారు. రక్తంలో ఉండే యాంటీ బాడీస్‌ ఆధారంగా, ఈ నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో, 30.6 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లినట్టు తేలింది. ఈ సంస్థ అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇంకా ఎక్కువ కేసులు వచ్చే అవకాసం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇంత మందికి క-రో-నా వచ్చి వెళ్ళింది అనేది భయపెట్టే విషయం అయితే, అంత మందికీ కనీసం వైరస్ సోకినట్టు కూడా తెలియకుండానే, తగ్గిపోయింది అనేది ఊరటను ఇచ్చే విషయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read