ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రత అధికంగా ఉంది. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ క-రో-నా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం లో ఈ రోజు ఉదయానికి రికార్డు స్థాయిలో 796కి చేరుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య 12285కి చేరుకుంది. క-రో-నా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత ఉధృతంగా పెరగడమే కాకుండా గడిచిన వారం రోజులుగా సగటున రోజుకు 450కి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఉదయం వెల్లడించిన సమాచారాన్ని అనుసరించి రాష్ట్రంలో క-రో-నా గడిచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో స్థానికంగా ఉన్న వారిలోను, , విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోను కలిపి కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయితే వాటిలో అత్యధికం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండటం అధికార వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నిన్న కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులను గమనిస్తే వాటిలో 22,305 మంది స్థానికంగా వున్నవారికి చెందిన శాంపిల్స్ ను పరీక్షించగా 570 మందిలో కొత్తగా కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారిని గుర్తించారు.

దీంతో రాష్ట్ర పరిధిలో నమోదైన కేసులు 10093 కి చేరు కొన్నాయి. ప్రస్తుతం 5652 మంది ఆస్పత్రుల్లో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. గడిచిన ఒక్కరోజులో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 157 కరోనా మరణాలు నమోదయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో గత 24గంటల వ్యవధిలో 51 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులను కొత్తగా గుర్తించారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 1815 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులను గుర్తించారు. వీరిలో 704 మంది క-రో-నాకు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. గడిచిన ఒక రోజు వ్యవధిలో 5గురు విదేశీ యుల్లో క-రో-నా పాజిటీవ్ లక్షణాలు గుర్తించారు. దీంతో వీరితో పాటు - విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 377 మందిలో క-రో-నా పాజిటివ్ కేసులు గుర్తించారు. వీరిలో 292 మంది ఆస్పత్రుల్లో క-రో-నా చికిత్సలు పొందుతున్నారు. రాష్ట్రంలో క-రో-నా వైరస నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య వారం క్రితం 53శాతం వరకు ఉంటే గత వారం రోజులుగా ఈ శాతం 47.8కి తగ్గింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read