రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరింది. రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకు కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 23, చిత్తూరు జిల్లాలో 7 కొత్త కేసులు నమోదవగా... ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు... కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 9:00 నుంచి ఇవాళ ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలు లో 2, చిత్తూరు లో 7, కర్నూల్ లో 23, నెల్లూరు లో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా, అనంతపురంలో 3, చిత్తూరులో 17, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 30, కడపలో 23, కృష్ణాలో 28, కర్నూల్ లో 27, నెల్లూరులో 34, ప్రకాశంలో 23, విశాఖలో 15, వెస్ట్ గోదావరిలో 15 పోజిటివ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం, విజయనగరంలో, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు రాలేదు. ఇక మరో పక్క, తెలంగాణలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 272కు చేరింది. గత రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అత్యధికంగా 490 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తమిళనాడులో 485, దిల్లీలో 445, కేరళలో 306, తెలంగాణలో 269, ఉత్తరప్రదేశ్​లో 227 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాజస్థాన్​లో 200, ఆంధ్రప్రదేశ్​లో 161, కర్ణాటకలో 144, గుజరాత్​లో 105, మధ్యప్రదేశ్​లో 104 కేసులు నమోదవగా.. జమ్ముకశ్మీర్​లో 92, పశ్చిమ బంగాలో 69, పంజాబ్​లో 57, హరియాణాలో 49, బిహార్​లో 30, అసోంలో 24, ఉత్తరాఖండ్​లో 22, ఒడిశాలో 20, ఛత్తీస్​గఢ్​లో 22, లద్ధాఖ్​లో 14 మంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. అండమాన్​ నికోబార్​ దీవుల్లో 10, ఛండీగఢ్​లో 10, గోవాలో 7, హిమాచల్​ ప్రదేశ్​లో ​6, పుదుచ్చేరిలో 5 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జార్ఖండ్​, మణిపుర్​లో చెరో రెండు కేసులు, మిజోరాం, అరుణాచల్​ప్రదేశ్​​లో చెరో కేసు వచ్చినట్లు గణాంకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.

భారత్​లో కరోనా వైరస్​ కేసులు 3,374కు పెరిగాయి. ఇప్పటివరకు మొత్తం 77 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3030 కేసులు యాక్టివ్​లో ఉండగా, 26 మందిని డిశ్చార్జి చేశారు. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మృతి చెందారు. గుజరాత్​లో 10, తెలంగాణలో 7, మధ్య ప్రదేశ్​, దిల్లీలో చెరో ఆరు, పంజాబ్​లో 5 మంది మరణించారు. కర్ణాటక - 4, పశ్చిమ బంగా - 3, తమిళనాడు - 3, జమ్ముకశ్మీర్​, ఉత్తరప్రదేశ్, కేరళలో చెరో రెండేసి మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్​, బిహార్​, హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు చనిపోయారు. రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. ఫలితంగా ఈ రాష్ట్రంలోని మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read