సెలక్ట్ కమిటీ ముగిసిన అధ్యయనమని అధికారపక్షం తెగేసి చెప్తుండగా ప్రతిపక్షం మాత్రం కమిటీ సజీవంగానే ఉందని నిరూపిస్తామంటూ సవాల్ చేస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సెలక్ట్ కమిటీ రగడ రోజుకొక మలుపు తిరుగుతుంది. బిల్లులను సెలక్ట్ కమిటీకి 14 రోజులలోపు పంపాలని ఆ గడువులోపు కమిటీని ఏర్పాటు చేయలేకపోతే నిబంధనల ప్రకారం బిల్లులు పాస్ అయిపోయినట్లేనని అధికారపక్షం స్పష్టం చేస్తుంది. అయితే విపక్షం మాత్రం మండలి చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని యోచిస్తూ ఆ దిశగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఇదే క్రమంలో శాసన మండలిలో ఆమోదం కోసం పంపిన బిల్లులను గవర్నర్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఆ దిశగా గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవుతోంది. దీంతో సెలక్ట్ కమిటీ వివాదం కొత్త మలుపు తిరిగినట్లవుతుంది. ఇదే విషయంపై ఇరు పార్టీలు ఎవరి వాదనలు వారు వినిపించారు.

ప్రధానంగా అధికారపక్షం మాత్రం రెండు వారాల గడువు పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వం మండలికి పంపిన మూడు బిల్లులు పాస్ అయిపోయినట్లేనని ఈ విషయంలో ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా తామే విజయం సాధించామని ప్రకటించింది. ఇదే సందర్భంలో విపక్షం అధికారపార్టీపై నిప్పులు చెరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మండలి చైర్మన్ నిర్ణయాలను కూడా పాటించకుండా కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువస్తుందని ఖచ్చితంగా సెలక్ట్ కమిటీ వ్యవహారంపై తాము మరింత ముందుకు వెళతామని అవసరమైతే ఈ విషయంలో దూకుడుకూడా పెంచుతామని కరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరి రాజకీయ యుద్ధ వాతావరణాన్ని సృష్టించే దిశగా సాగుతుంది. శాసనమండలిలో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి అను కూలంగా వ్యవహరిస్తున్న మండలి కార్యదర్శిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని మండలిలో బలమున్న టిడిపి యోచిస్తూ ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతుంది.

శాసనమండలి చైర్మన్‌ఎంఎ.షరీఫ్ ముందు మూడు ఆపన్లు ఉన్నాయి. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను తిరస్కరించడమా..? లేక ఆమోదించడమా..? అది సాధ్యం కాకపోతే సెలక్ట్ కమిటీకి పంపాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వివాదాలను ఒక్కసారి పరిశీలిస్తే బిల్లులను ఆమోదించే పరిస్థితి లేదు. అలాగని తిరస్కరించడానికి గడువు కూడా ముగిసింది. ఇక ఆయన ముందు ఉన్న ఏకైక మార్గం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయడమే ఆ ప్రక్రియకు సంబంధించి మండలి కార్యదర్శి ఫైలను వెనక్కి పంపారు. దీంతో మండలి చైర్మెన్ ఈ విషయం పై, కోర్ట్ కు కూడా వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తుంది. ఒక సభ చైర్మెన్ కాని, స్పీకర్ కాని నిర్ణయం తీసుకుంటే, అది తప్పు బట్టే అవకాసం కోర్ట్ లకు కూడా ఉండదని, ఇక ఈ ప్రభుత్వ అధికారులు ఎంత అనే వాదన కూడా వస్తుంది. ఇప్పటికే రోజుకి ఒకసారి కోర్ట్ లు ప్రభుత్వాన్ని ఏదో ఒక సందర్భంలో మొట్టికాయలు వేస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా కోర్ట్ వరకు వెళ్తే, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. రెండు, మూడు నెలల కోసం, ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంటుందో అర్ధం కావటం లేదు. సెలెక్ట్ కమిటీ ప్రజా అభిప్రాయం తీసుకుంటే, అది తమకు వ్యతిరేకంగా వస్తుంది అని ప్రభుత్వం భయం కావచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read