విశాఖలో నర్సీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను అరెస్ట్ చేసిన వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనతో ప్రమేయం వున్న పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై ఎనిమిది వారాల్లో నివేదికను ఇవ్వాలని సీబీఐకి న్యాయస్థానం వ్యవధిని నిర్దేశించింది. డాక్టరుగా పనిచేసే సుధాకర్ కరోనా సేవల చేసేందుకు తమకు పీపీఈ కీట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యా యి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సుధాకర్‌ను సస్పెండ్ చేసింది. ఈ పరిణామం నడుమ దాదావు 15రోజుల అనంతరం సుధాకర్ గుండుతో విశాఖ రోడ్లపై గుర్తుపట్టలేని స్థితిలో ప్రత్యక్షమయ్యారు.

ఆయన రోడ్డుపై ఇబ్బంది కలిగించే రీతిలో ప్రవర్తిస్తున్నాడంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. పోలీసులు ఆయన్ను కొట్టి, చేతులు వెనక్కు విరిచి కట్టి, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారని ఈ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి, ఆ మేరకు ప్రసార మాధ్యమాల్లో విజువల్స్ , ప్రచురణ మాధ్యమాల్లో ఫోటోలు వచ్చాయి. ఆయన మానసిక స్థితి బాగోలందంటూ ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ విషయం తీవ్ర వివాదస్పదంగా మారింది. ఈ వ్యవహరంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత హైకోర్టుకు లేఖ రాసారు. ఒక వైద్యుడితో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని తన లేఖలో అనిత హైకోర్టుకు వివరించారు.

ఈ లేఖపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసును జారీ చేసింది. సుధాకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని ఫిర్యాది కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీంతో హైకోర్టు విశాఖలోని స్థానిక న్యాయమూర్తిని సుధాకర్ చికిత్స నిమిత్తం చేర్పించబడిన ఆస్పత్రికి పంపింది. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఈ వాంగ్మూలాన్ని పరిశీలించిన మీదట కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఏకంగా ప్రభుత్వ నివేదిక మీద నమ్మకం లేదు అని చెప్పటం సంచలనంగా మారింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన వీడియోలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయని, కోర్ట్ వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వ నివేదికలో, కేవలం కన్నుబొమ్మ పై కేవలం స్వల్ప గాయం అయ్యింది అని చెప్పగా, మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఆరు గాయాలు ఉన్నాయని, కోర్ట్ పేర్కొంది. సుధాకర్ తన వాంగ్ములంలో, పోలీసుల పైనే ఆరోపణలు చేసారని, వారికే ఈ దర్యాప్తు ఇవ్వటం సరికాదు అని కోర్ట్ చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read