ఆంధ్రపదేశ్ ఉద్యోగులు మళ్ళీ నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై, ఇతర అంశాల పై ఇచ్చిన జీవోలో ఉన్న అంశాలు చూసి షాక్ తిన్న ఉద్యోగులు, మళ్ళీ నిరసన బాట పట్టారు. అయితే ఉద్యోగుల నిరసనకు, ఈ రోజు అడ్డ్రెస్ చేస్తూ చీఫ్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో సానుకూలత వస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే చీఫ్ సెక్రటరీ వారికి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల ఆందోళన పై చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రినిసిపల్ సెక్రటరీ రావత్ మీడియా సమావేశం పెట్టి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల వినతి పై స్పందిస్తూ, ఇప్పుడు కోవిడ్, ఒమిక్రాన్ ఉన్నాయని, అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ, పీఆర్సీ ని ఫ్రేం చేసామని అన్నారు. 17 వేల కోట్ల మధ్యంతర భ్రుతి ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చాం అని అన్నారు. ఐఆర్ సాలరీలో భాగమనే ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఉద్యోగి జీతంలో గ్రాస్ సాలరీ తగ్గకుండా చూడాలని, తాము అదే చేసామని అన్నారు. అయితే మిగతా వాటిల్లో మాత్రం, కొన్ని తగ్గవచ్చు, కొన్ని పెరగవచ్చని, గ్రాస్ సాలరీ మాత్రం గతంలో కంటే ఎక్కువే ఉందని అన్నారు. అలాగే 62 ఏళ్ళ ఉద్యోగ రిటైర్మెంట్ వయసు పెట్టటం వల్ల, ఉద్యోగాలు తగ్గిపోతాయి అనేది కూడా సమంజసం కాదని అన్నారు. జీవన ప్రమాణాలు ఏపిలో పెరిగాయని అన్నారు.

cs 19012022 2

అందుకే రిటైర్మెంట్ వయసు పెంచామని అన్నారు. దీంతో పాటు ఐఆర్ కంటే తక్కువగా పీఆర్సీ ఇచ్చారని, ఉద్యోగులు చెప్పిన విషయం పై, మళ్ళీ పీఆర్సీ వేసిన విషయంలో, ఐఆర్ వెనక్కు తీసుకునే అవకాసం తమకు ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నుంచి, ఇప్పటి వరకు అన్ని పరిణామాలు చెప్పుకుంటూ వస్తున్నారు. దక్షిణాదిలోనే అన్ని రాష్ట్రాల కంటే, మనకే తక్కువ ఆదాయం వస్తుందని అన్నారు. అలాగే తెలంగాణాలో మన ఆస్తులు ఇంకా రావలసి ఉందని అన్నారు. రాజధాని లేకపోవటం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం నష్టపోయిందని వాపోయారు. అలాగే కరెంటు బకాయలు కూడా తెలంగాణా నుంచి రావాలని అన్నారు. ఇలా అన్ని విషయాలు, చెప్పుకుని వచ్చారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగులకు చాలా చేసామని అన్నారు. ఇలా తమ ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగులు తమ బాధ గురించి చెప్పమంటే, ప్రభుత్వ బాధలు చెప్పటం పై షాక్ అయ్యారు. మరి ఉద్యోగులు ఏమి చేస్తారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read