టిడిపి నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను నిన్న ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర అరెస్ట్ వెనుక రాజకీయం కోణంపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ధూళిపాళ్ల నరేంద్ర కొద్ది రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్టింగ్ ఆపరేషన్ చేసారు. ఆ కక్షతోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపిస్తుంది. అమరావతిలో, దళితుల అసైన్డ్ భూములు దోచేశారు అంటూ, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై సిఐడి, చంద్రబాబు, నారాయణ పై కేసు పెట్టినవ్ విషయమై, ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు అన్నీ చెప్పటమే కాక, స్టింగ్ ఆపరేషన్ వీడియోలు కూడా బయట పెట్టారు. అందులో, మేము ఏమి ఫిర్యాదు చేయలేదని, సంతకాలు పెట్టుంచుకున్నారని, ఎందుకో కూడా చెప్పలేదని చెప్పటంతో, అమరావతి కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసు అని అందరికీ అర్ధమై పోయింది. ధూళిపాళ్ల నరేంద్ర ఆ స్టింగ్ ఆపరేషన్ చేసి, జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయట పెట్టినందుకే, ఆయన పై ఇప్పుడు కక్ష పెట్టుకున్నారని లోకేష్ కూడా ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ, తెలుగుదేశం నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ అన్నారు. అయుదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం అని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసిన చరిత్ర ఉందని, అలాంటి వారిని, ఇలా అక్రమ కేసులు పెట్టి వేధించటం ఎంత వరకు సమంజసం అని లోకేష్ ప్రశ్నించారు.

dhulipalla 24042021 2

ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇవే ఆరోపణలు చేసారు."క-రో-నా పరిస్థితి పై సమీక్షించాల్సిన ముఖ్యమంత్రి, ఏసీబీ, సీఐడీ అధికారులతో గంటలతరబడి చర్చలు జరుపుతున్నాడు. ఈరోజు ఏమాజీమంత్రిని అరెస్ట్ చేయాలి... ప్రతిపక్షానికిచెందిన ఏనాయకుడిపై ఎలాంటి తప్పుడుకేసులు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ప్రశ్నించే గొంతులను ఎలా నొక్కాలనే దానిగురించి చర్చిస్తున్నాడు. నిన్న వందలకొద్దీ పోలీసులు, ఏసీబీ అధికారులు టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్రఇంటికెళ్లి, ఒక బందిపోటుని, గూండాను తీసుకొచ్చినట్లుగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రిగారైన ధూళిపాళ్ల వీరయ్యచౌదరి సంగం డెయిరీని స్థాపించి, రూ.1100కోట్ల టర్నోవర్ వచ్చేస్థాయికి దాన్ని తీసుకెళ్లారు. నేడు ఆ సంస్థ పాడి రైతులకు లీటర్ పాలకు రూ.66చెల్లిస్తోంది. దానితోపాటు బోనస్ లు ఇస్తోంది. ఎంతోమంది పాడిరైతులకు అండగా ఉంటున్న సంగం డెయిరీ ఛైర్మన్ ఇంటిపైకి వందలమంది పోలీసులను పంపి, ఆయనకు అవినీతి మరక అంటించాలని చూస్తారా? దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చూపుతున్నది నరేంద్రమీద కక్షకాదు, అది సంగం డెయిరీపై ఉన్న కక్ష. ఈ ముఖ్యమంత్రి పెద్దఎత్తున రాష్ట్రంలో అమూల్ డెయిరీని ప్రోత్సహించి, దాన్ని బాగుచేయడంకోసం సంగండెయిరీని దెబ్బకొట్టడానికి, అవినీతికుట్రలో భాగంగా, రాజకీయకక్షలోభాగంగానే నరేంద్రను అరెస్ట్ చేయించాడు. నరేంద్రపై ముఖ్యమంత్రి ఉన్న కోపానికి కారణం.. గతంలో అతను జగన్మోహన్ రెడ్డి అక్రమఆస్తులను, అవినీతి గురించి అసెంబ్లీలో ప్రశ్నించడమే. జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను గురించి నరేంద్ర నిలదీశాడు. చంద్రబాబుపై, మాజీమంత్రి నారాయణపై అమరావతి భూములకు సంబంధించి పెట్టిన తప్పుడుకేసుల తాలూకా స్టింగ్ ఆపరేషన్లో ధూళిపాళ్ల నరేంద్ర సమర్థవంతంగా వ్యవహరించాడు. ప్రభుత్వంపెట్టినవన్నీ తప్పుడుకేసులేనని ఆధారాలతో సహా మీడియా ద్వారా నరేంద్ర నిరూపించాడు. నరేంద్ర ప్రభుత్వ తప్పుడుకేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో , అమూల్ ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, ఆ వంకతో నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నాడు." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read