విశాఖపట్నం డాక్టర్ సుధాకర్, తనకు వైద్యం సరిగ్గా అందటం లేదు అని చెప్పి, రాష్ట్ర హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆయన తరుపు నయ్యవాదులు, ఈ రోజు ఆ పిటీషన్ ని, ఈ రోజు హైకోర్ట్ లో దాఖలు చేసారు. విశాఖపట్నంలో, ప్రస్తుతం ఉన్న మానిసిక వైద్యశాలలో తనకు వైద్యం సరిగ్గా అందటం లేదని, తనకు కోర్ట్ పర్యవేక్షణలో వైద్యం అందించేలా ప్రైవేటు హాస్పిటల్ కు కాని, లేదా ఇతర హాస్పిటల్ కు కాని, తరలించాలని ఆయన ఆ పిటీషన లో తెలిపారు. దీంతో పాటుగా, అక్కడ వైద్యులు ఇచ్చిన, టాబ్లెట్స్ వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ రావటంతో పాటుగా, వివిధ రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన వివరించారు. డాక్టర్లు ఇస్తున్న టాబ్లెట్లు సంబంధించి, అన్ని వివరాలు ఆయన ఆ పిటీషన్ లో కోర్ట్ కు తెలిపారు. ప్రభుత్వం తన పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది అనే అనుమానాన్ని, ఆందోళనను వ్యక్త పరిచారు.

దీంతో పాటుగా తగిన చర్యలు తీసుకోవాలని, రెస్పాండెంట్ గా విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తో పాటుగా, ఇతర ఉన్నతాధికారులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ప్రినిసిపల్ సెక్రటరీని, డీజీపీని, విశాఖ మానసిక హాస్పిటల్ సూపర్ ఇంటన్డెంట్ ని ఆయన, ఇందులో చేర్చారు. తాను కోరుకున్న హాస్పిటల్ కు కాని, లేదా కోర్ట్ పర్యవేక్షణలో వేరే హాస్పిటల్ కు కాని , పంపాలని కోరారు. తనకు ఎటువంటి, మానిసిక ఇబ్బంది లేదని, ఆ పిటీషన్ లో పేర్కుంటూ, ఈ టాబ్లెట్స్ వాడటం వలన, తన శరీరంలో వస్తున్న అనేక ఇబ్బందులు, ఎదుర్కుంటున్నానాని, మోతాదుకు మించి, అనవసర టాబ్లెట్స్ ఇస్తున్నారని, కోర్టుకు చెప్తూ, తన బాధ చెప్పుకున్నారు. ఈ పిటీషన్ పై, రేపు విచారణకు వచ్చే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read