జగన్ మోహన్ రెడ్డి అక్రమా ఆస్తుల కేసు 2012 నుంచి సాగుతూనే ఉంది. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు వేసి, చార్జ్ షీట్లు కూడా వేసారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఇతర నిందితులు, 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వటంతో, కోర్టు కండీషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో, ఈడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది. అయితే కేసుల విచారణ మాత్రం సాగుతూనే ఉంది. గత ఏడాదికి పైగా, అసలు జగన్ విచారణకు హాజరు కాలేదు. ఇదే విషయం పై, కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయమని, రఘురామకృష్ణం రాజు పిటీషన్ కూడా దాఖలు చేసారు. ఇది ఇలా ఉంటే, ఆస్తుల జప్తు విషయంలో, ఇప్పుడు ఈడీ వేసిన పిటీషన్, కోర్టులో విచారణకు వచ్చింది. భారతి సిమెంట్స్ కేసులో డైరెక్టర్ గా ఉన్న జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు ఇది వరకు ఈడీ జప్తు చేసింది. అయితే ఆ ఆస్తులు జప్తు నుంచి విడుదల చేయవచ్చు అంటూ, ఢిల్లీలోని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ తీర్పు పై హైకోర్టులో సవాల్ చేసింది. ఈడీ చేసిన అపీల్ పై, మంగళవారం, తెలంగాణాలో ఉన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టులో నిన్న వాదనలు ముగిసాయి.

ed 21042021 2

దీని పై తీర్పుని హైకోర్టు వాయిదా వేసింది. వచ్చే వాయిదాలో, ఈడీ చేసిన అపీల్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విషయంలో భారతి సిమెంట్స్ పై నమోదు అయిన కేసు విషయంలో, ఆ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న, జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి అస్తులు ఈడీ గతంలో జప్తు చేసింది. జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు. జెల్లా జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ల్యాంకోహిల్స్‌లో ఉన్న ఒక అపార్ట్ మెంట్ తో పాటుగా, కడపలో ఉన్న 27 ఎకరాల భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. అయితే దీని పై అపీల్ కు వెళ్ళిన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డికి, అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ లో ఊరట లభించింది. జప్తు చేసిన ఆస్తులు విడుదల చేయాలని తీర్పు వచ్చింది. అయితే అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పు పై, ఈడీ హైకోర్టు లో సవాల్ చేసింది.ఈ కేసుని జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మన్సం విచారణ చేస్తుంది. ఈడీ తరుపున సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, ఈ కేసుని వాదించారు. అయితే ఈ కేసు పై తీర్పు, ఎలా వస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read