ప్రజలకి మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వానికి నేరుగా తమ సమస్యలు చెప్పుకునే లేదా ఏదైనా సమాచారం ఇచ్చే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. అందులో భాగంగా సచివాలయంలో ప్రతి శాఖకు ఒక శాశ్వతమైన ఈ మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది.

email 12122018 2

దీని ప్రకారం సచివాలయంలోని 36 శాఖలకు సంబంధించిన శాఖాధికారులు తమ శాఖల మెయిల్స్ ను గంటకొకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. అంతేగాక అధికారులు తమ స్మార్ట్ ఫోన్స్ తో ఆయా శాఖల మెయిల్స్ ను అనుసంధానం చేసుకొని ప్రజల నుంచి వచ్చే సందేశాలను పరిశీలిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి ఉత్తర్వులు జారీ చేశారు .

email 12122018 3

Advertisements

Advertisements

Latest Articles

Most Read