శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన షాక్ తో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీవ్ర ఇరకాటంలో పడింది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుని, ఈ రోజు శాసనమండలిలో వైసీపీ ప్రవేశ పెట్టటం, వెంటనే, తెలుగుదేశం పార్టీ రూల్ 71 కింద నోటీస్ ఇవ్వటంతో, వైసీపీ విలవిలలాడుతుంది. రూల్ 71 ప్రకారం, ప్రభుత్వ పాలసీ డెసిషన్ ను వ్యతిరేకించవచ్చు. ఇది కనుక సభ ఆమోదం పొందితే, ఇక ఆ బిల్లు పెట్టటానికి, ప్రభుత్వానికి వీలు ఉండదు. ఎలా అయినా బిల్ టేబుల్ చేస్తే చాలు, డీమ్డ్ టు బీ పాస్ అని చెప్పుకుని, వెళ్లిపోవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా, రూల్ 71 నోటీసు ఇవ్వటంతో, ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. విజయసాయి రెడ్డి, కూడా శాసనమండలిలో ఉంటూ, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం లాయర్లు కూడా ఈ విషయంలో ఏమి చెయ్యలేం అని చేతులు ఎత్తేసారు. చివరగా దీనికి ఒకటే పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తుంది. అదే శాసనమండలి రద్దు.

assembly 21012020 2

ఈ రాత్రికి అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రేపు శాసనమండలిని రద్దు చేస్తున్నామని, దీనికి సంబంధించి బిల్లుని, రేపు అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నాం అంటూ వైసీపీ ప్రభుత్వం లీకులు ఇచ్చి, తెలుగుదేశం ఎమ్మెల్సీలను భయ పెట్టే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం నుంచి ఇలాంటి ఇబ్బందులే వస్తాయని, జగన్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే శాసనమండలి రద్దు చేస్తాం అంటుంది. అయితే, ఇది టెక్నికల్ గా ఎంత వరకు సాధ్యం అనేది చూడాల్సి ఉంది. మరో పక్క, ఈ బెదిరింపుల పై శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల స్పందించారు. శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల వ్యాఖ్యానించారు. శాసనమండలి రద్దు చెయ్యాలంటే, చాలా పెద్ద ప్రక్రియ అని అన్నారు.

assembly 21012020 3

కేవలం కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే శాసనమండలి రద్దు సాధ్యమవుతుందని చెప్పారు. ఇదంతా పూర్తీ కావటానికి, మరో ఏడాది పడుతుందని అన్నారు. అలాగే నారా లోకేష్ స్పందిస్తూ, లాంటి బెదిరింపులకు భయపడం అని అన్నారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా మండలిలో తాము కూడా తీర్మానం చేయగలమని తెలిపారు. అయితే దీనికి సంబంధించి టిడిపి ఒక మెసేజ్ న్ మీడియాకు ఇచ్చింది. "Who can abolish a legislative council? The power of abolition and creation of the State legislative council is vested in Parliament of India as per article 169. But again, to create or to abolish a state legislative council, the state legislative assembly must pass a resolution, which must be supported by majority of the strength of the house and 2/3rdmajority of the present and voting(Absolute  + Special Majority). When a legislative council is created or abolished, the Constitution of India is also changed. However, still, such type of law is not considered a Constitution Amendment Bill.  (Article 169). The resolution to create and abolish a state legislative council is to be assented by the President also."

Advertisements

Advertisements

Latest Articles

Most Read