రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అధికారిక కార్యకలాపాలు అమరావతి నుంచి కాకుండా విశాఖ నుంచే ప్రారంభం కాబోతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. అయితే ఆదివారం ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆకస్మికంగా ఆరు వారాలు వాయిదా వేయడం తాత్కా లికంగా ఊరట కలిగించే విషయం అయినా తరువాత విశాఖ తప్పదన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఉద్యోగులను అలెర్ట్ చేసారు. ఇదిలా ఉండగా మే నెలలో అమరావతిని వీడి విశాఖకు వెళ్లే విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సచివాలయ ఉద్యోగులు వాటి విషయంలో ప్రభుత్వం నుంచి హామీల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఆలోచనలో ఉన్నారు. విశాఖ ప్రతిపాదన చర్చలు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మే నెల తర్వాత విశాఖ వేదికగా పాలన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

దీంతో ఈ లోపే ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎస్ నీలం సాహ్ని పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల డిమాండ్లు ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖ వెళ్ళేందుకు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటిని ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా విశాఖకు మే నెలలో వెళ్లగానే అక్కడ తాత్కాలికంగా అయిన ప్రభుత్వం వసతి సదుపాయాలు కల్పించాలని, అలాగే విశాఖకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలు చెల్లించాలని ఉద్యోగులు ప్రతిపాదన చేశారు. అదే విదంగా తమపిల్లలకు విశాఖలో విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరికేలా ప్రభుత్వం సాయం చేయాలని కూడా ఉద్యోగులు అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నప్పటికి ప్రధానంగా వీటిపైనే ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.

గత వారం భేటీలో నిర్ణయం విశాఖ వెళ్లేందుకు ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్ల పై ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చుస్తున్నారు. కాగా మే నెలలో తరలింపు ప్రారంభించి జూన్ చివరి నాటికి సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ ముందు పెట్టిన డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను కోరింది. దీంతో వారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. త్వరలో వారు ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆకస్మికంగా వాయిదా వేయడం, కరోనా వైరస్ నేపథ్యంలో అమరావతి నుంచి పరిపాలన విశాఖపట్నంకు మార్చే ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క ఈ విషయం కోర్టులో ఉండగా, ప్రభుత్వం కనుక ఇలా దూకుడుగా వెళ్తే, కోర్ట్ లో ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే కోర్ట్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఆఫీసులు మార్చితే, ఆ ఖర్చులను అధికారుల నుంచే వసూలు చేస్తాం అని కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read