వాళ్ళు అన్నం పెట్టే రైతులు. అంతే కాదు, ఈ రాష్ట్రం ముక్కలు అయి రోడ్డున పడితే, మనది రాజధాని లేని రాష్ట్రం అని, రాజధాని కోసం భూములు ఇవ్వాలని అడిగితే, తమతో పాటు, ఈ రాష్ట్రం కూడా బాగు పడుతుందని నమ్మి, 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతులు వాళ్ళు. వాళ్ళేమి నేరాలు, ఘోరాలు చేయలేదు. అయినా ఈ రోజు ఆ రైతులను చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చేతులకు బేడీలు వేసి, బస్సులో నుంచి దింపుతుంటే, గుండె తరుక్కు పోయింది. ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే, 315 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పై ఎలాంటి స్పందన లేకపోయినా వారు శాంతి యుతంగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇక్కడే అమరావతికి పోటీగా, ఆటల్లో కొంత మందిని తీసుకొచ్చి, కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారు కొంత మంది. ఆటల్లో వేరే ఊరి నుంచి తమ ఊరి వచ్చి హడావిడి చేస్తున్న వారిని, అడ్డుకున్నారు రైతులు. ఇప్పుడు అదే వారి పాలిట శాపం అయ్యింది. కేవలం అడ్డుకున్నందుకు రైతు చేతికి సంకెళ్ళు వేసారు. మా గ్రామంలోకి బయట నుంచి ఎలా వస్తారు అని అడిగినందుకు వారి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి, 11 మంది దళిత, బీసి రైతులను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తరువాత, వారిని నరసరావుపేట సబ్ జైలుకు, మళ్ళీ అక్కడ నుంచి ఈ రోజు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ తరలించే క్రమంలో, 8 మంది రైతులకు సంకెళ్ళు వేసారు. ఈ ఘటన పై అందరూ షాక్ అయ్యారు. వాళ్ళు ఏమి పాపం చేసారు, రాజధానికి భూములు ఇవ్వటమే వారి తప్పా అంటూ వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

అయితే ఈ పరిస్థితి చూసిన రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఇద్దరికి కలిపి సంకెళ్ళు వేసి, ఇలా దారుణంగా తీసుకురావటం పై, ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే, ఈ ప్రభుత్వం తమ చేతికి సంకెళ్ళు వేసి, బహుమానం ఇచ్చిందని వాపోయారు. రైతు కుటుంబాలు మానసిక వేదన గురి అవుతున్నారు. అయితే పోలీసులు, ఈ విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. రైతులను, అదీ తమ ఊరికి ఎందుకు వస్తున్నారు అని అడిగిన కేసు విషయంలో, ఇంతలా చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో పక్క ఇప్పటికే, ఈ కేసు పెట్టిన వ్యక్తి తాను కేసు వెనక్కు తీసుకుంటాను అని పోలీసులకు రిటెన్ గా రాసి ఇచ్చినా, పోలీసులు మాత్రం, కోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎవరు చెప్తే చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని, తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 315 రోజులుగా వేదిస్తున్నారని, ప్రభుత్వం ఇలా చేసి ఏమి సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారం పై ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read