హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన దగ్గర నుంచి, గత నాలుగు రోజులుగా, రాజధాని అమరావతి గ్రామాల్లో, పోలీసులు హడావిడి తగ్గింది. ప్రజలు, నాయకులు స్వేచ్చగా నిరసన తెలపటం, రోజు వారీ కార్యక్రమాలు చెయ్యటం, అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి అనుకున్న టైంలో, మరోసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు మరోసారి రాజధాని రైతులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మీడియాలో అసెంబ్లీ ముట్టడితో పాటు జైల్‌భరో, గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడి అంటూ వచ్చిన ప్రకటనల ఆధారంగా, పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. రైతులతో పాటుగా, నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారు. సీపీఐ సీనియర్‌ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటున్న తెలుగు దేశం నేతలకు నోటీసులు అందాయి. అందరూ పోలీసులకు సహకరించాలి, నిబంధనలు అతిక్రమిస్తే, చర్యలు ఉంటాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 149 కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ రోజు ఉదయం, పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు.

notice 18012020 2

ఇక మరో పక్క, నిన్న హైకోర్ట్ పోలీసులు, ప్రభుత్వం తీరు పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో 1-4-4 సెక్షన్ అమలుపైన రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో పోలీసులు భారీస్థాయిలో క-వా-తు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించింది. మగ పోలీసులు మహిళలతో వ్యవహరించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 1-4-4, పోలీసు యాక్టు 3-0 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వకేట్ జనరల్ దాదావు గంటపాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి రాజధాని అమరావతిలో 1-4-4 సెక్షన్ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. రాజధాని గ్రామాల్లో పోలీసులు విధించిన ఆంక్షలపైన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టులో విచారణ ముగిసింది.

notice 18012020 3

దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. గతంలోనే ఈ సెక్షన్‌ను అమలు చేశారనీ, ప్రస్తుతం పొడిగింపు మాత్రమే జరిగిందన్నారు. శాంతి భద్రతల సమ స్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశ్యంతోనే రైతులను అడ్డుకున్నట్లు ఎజి వివరించారు. రాజధాని ప్రాంతంలో 1-4-4 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 610 మం దిపై కేసులు పెట్టడంపైనా న్యాయమూర్తులు ఎజిని వివరణ అడిగారు. ఇదే సమయంలో కోర్టు పోలీసుల తీరుపై వచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన ఫోటోలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. 610 మందిపైన కేసులు పెట్టడానికి గత కారణాలను ఎజి చెప్పుకొచ్చారు. రాజధానిలో పోలీసులు భారీస్థాయిలో క-వా-తు ఎందుకు నిర్వహించారనీ, మందడంతో మహిళను పోలీసులు బూ-టు కాలుతో ఎందుకు త-న్నా-రం-టూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆం-దోళనలో మహిళల నోరు ఎందుకు నొక్కారంటూ న్యాయమూర్తి ఎజిని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read