వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జగన్ కు స్నేహితుడు. మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా శ్రీకాంత్ రెడ్డికి పేరు ఉంది. అలాంటి శ్రీకాంత్ రెడ్డికి, జగన్ షాక్ ఇచ్చారు. ఉన్న పదవి కూడా పీకేయటంతో, ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఉన్నారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి. అయితే జగన్ గెలిచిన వెంటనే, గడికోట శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. మంత్రి పదవి రాకపోవటంతో, శ్రీకాంత్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇచ్చి, జగన్ గౌరవించారు. తరువాత మొన్న జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో, శ్రీకాంత్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే అప్పుడు కూడా శ్రీకాంత్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డికి ఉన్న చీఫ్ విప్ పదవి కూడా, జగన్ పీకేసారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి కేవలం విప్ మాత్రమే. చీఫ్ విప్ గా ముదునూరి ప్రసాదరాజును నియమించారు. మిత్రుడిగా పేరు ఉన్న శ్రీకాంత్ రెడ్డికి, జగన్ ఇలా ఎందుకు చేసారా అని, వైసీపీ శ్రేణులే విస్మయానికి గురయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read