మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గురించి తెలియని తెలుగు వారు ఉండరు.. రోజు ఉదయమే, నవజీవన వేదం అంటూ, మనల్ని పలకరిస్తూ, నాలుగు మంచి మాటలు చెప్తారు.. మొన్నా మధ్య, తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పిలవలేదు అని, తనకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు... అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థుతల పై కూడా స్పందించారు..

సాత్వికుడైన ఒక పండితోత్తముడు తన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, దగాని చూసి కలిగిన ధర్మాగ్రహంవల్ల గద్గదస్వరంతో ఏమంటున్నారో చూడండి. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ చంద్రబాబు రావాలని అందరూ కోరుకున్నారని, రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్ర సహాయం కావాలని అందరూ భావించారని, కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని అన్నారు... ఇలా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని, నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు... అనుభవంతో, అంకితభావంతో, చిత్తశుద్ధితో ఈ పేదరాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తపన పడుతున్న నాయకుడ్ని వదులుకుని, 2019 మే నెల తర్వాత ఒక అవినీతిపరుడిని నేను పాలకుడిగా చూడాలా అని కంపిస్తున్న గొంతుకతో ప్రశ్నిస్తున్నారు ఆయన. తెలుగుజాతి మొత్తం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన ఆణిముత్యాల్లాంటి పలుకులు ఆయన నోటివెంట వచ్చాయి...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే మన రాష్ట్రానికి కర్తా కర్మ క్రియ, భవిష్యత్తు అని భావించే ప్రతి ఒక్కరూ...,ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో పుణ్యభూమి సస్యశ్యామలం అవుతుందని భావించే ప్రతి ఒక్కరు ఈ గరికపాటి నరసింహారావు గారి వీడియోను చూసి అయిదు కోట్ల ప్రజల ఆవేదనను, ఆకాంక్షను అర్థం చేసుకోవాలని, ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, పది మందికి చెప్పాలని ఆశిస్తూ... ఆ వీడియో ఇక్కడ చూడండి, https://youtu.be/kCpvK9BesY0

Advertisements

Advertisements

Latest Articles

Most Read