ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నిన్న రాత్రి హైదరాబాద్ తరలించారు. ఆయనకు ఇటీవల క-రో-నా వచ్చి, క-రో-నా నుంచి కోలుకున్న తరువాత, ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స చేసారు. అయితే ఆయనకు నిన్న సాయంత్రం నుంచి కూడా అస్వస్థతగా ఉండటంతో, నిన్న రాత్రి ఆయన్ను గన్నవరం తీసుకొచ్చి, అక్కడ నుంచి ప్రయత్యేక విమానంలో హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు గతంలో కూడా ఏఐజి చికిత్స పొంది ఉండటంతో, అక్కడ డాక్టర్లతో మాట్లాడిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసం నిన్న రాత్రి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసారు. నిన్న రాత్రి హైదరాబద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దిగి, ఏఐజి హాస్పిటల్ కు వెళ్లారు. అయితే రాజ్ భవన్ సిబ్బంది మాత్రం, పోస్ట్ కో-వి-డ్ ఇబ్బందులతోనే, ఆయనను హైదరాబాద్ తరలించినట్టు చెప్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్ భవన్ సిబ్బంది చెప్పారు. పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ కోసమే ఆయన్ను హైదరాబాద్ తరలించామని చెప్తున్నారు. గవర్నర్ తో పాటుగా, ఆయన సతీమణి కూడా వెళ్లారు.

govenor 29112021 2

రాజ్ భవన్ వ్యక్తిగత వైద్యులు మాత్రం, ఆయన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామని, హైదరాబాద్ లో పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారని చెప్తున్నారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి పై, ఈ రోజు ఏఐజి హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాసం ఉంది. సరిగ్గా అయుదు రోజులు క్రితం గవర్నర్ ను గన్నవరం నుంచి ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఆ సమయంలో, ఆయనకు క-రో-నా అని తేలింది. ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశానికి వెళ్లి వచ్చిన తరువాత, అస్వస్థతకు గురి కావటంఓ, ఆయనకు విజయవాడలో టెస్ట్ లు చేసి, కోవిడ్ లక్ష్యనాలు ఉండటంతో, ప్రత్యేక విమానంలో ఆయన్ను హైదరాబాద్ తరలించారు. అక్కడ అయుదు రోజులు పాటు చికిత్స అనంతరం, ఆయన ఆరోగ్యం మెరుగు పడటంతో, గవర్నర్ ను డిశ్చార్జ్ చేసారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఆయన ప్రత్యెక వైద్య బృందం చికిత్స చేసింది. నాలుగు రోజులు తరువాత, మళ్ళీ ఆయన్ను ఏఐజికి తీసుకెళ్ళారు. ఇది కేవలం పోస్ట్ కో-వి-డ్ ట్రీట్మెంట్ అని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read