ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు, దారుణమైన రోడ్డులు గురించి, ఏపిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే మన అద్భుతం గురించి పక్క రాష్ట్రాల వారికి కూడా తెలిసిపోతూ, మనల్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. నెల రోజుల క్రితం, కేటీఆర్ మన పరువు తీసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉండదు, వాళ్లకు సరైన రోడ్డులు ఉండవు అంటూ హేళనగా మాట్లాడిన వీడియో పిచ్చ వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణా నుంచి మరో మంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. గతంలో హరీష్ రావు, జగన్ మోహన్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టే విషయం పై, జగన్ ను హేళన చేస్తూ మాట్లాడే వారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఏపిలో రైతులకు కనీసం కరెంటు ఇవ్వటం లేదని చెప్పి, జగన్ పరువు తీసారు. ఈ మధ్య తాను తిరుమల కాలి నడకన వెళ్లానని, అక్కడ చాలా మంది ఆంధ్రప్రదేశ్ రైతులు, తమకు కరెంటు లేదని, కనీసం ఏడు గంటలు కూడా, ఒకే దఫాలో ఇవ్వటం లేదని, కరెంటు కోతలు ఉన్నాయని చెప్పారు అంటూ, ఆంధ్రప్రదేశ్ లో జగన్ అసమర్ధత గురించి తెలిపేలా చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read