గత కొంత కాలంగా అమరావతి రైతుల చేస్తున్న పాదయత్రని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న కొంత మంది వైసీపీ పెద్దలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ రోజు అమరావతి రైతుల పాదయాత్రని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలి అంటూ, ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ దాఖు చేసింది. అలాగే అమరావతి రైతులు కోర్టు ఆదేశాలు పాటించటం లేదని కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం వేసిన ఈ పిటీషన్ ని హైకోర్టు కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. అలాగే సంఘీభావం తెలిపే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ, అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తెలపగా, దానికి కూడా స్పస్టమైన ఆదేశాలు ఇచ్చింది. సంఘీభావం ఏ రూపంలోనైనా తెలపవచ్చని, గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని చెప్పింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని, వారికి పోలీసులు వెంటనే ఐడి కార్డులు ఇవ్వాలని తెలిపింది. అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read