హైకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు అయిన పిటీషన్ పై నిన్న విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయటాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మేనిఫెస్టో విడుదలపై కమిషన్ సరిగా స్పందించ లేదని, కేవలం మ్యానిఫెస్టోని బయటకు వెళ్ళకుండా ఆపారని, కె.శివరాజశేఖర్‌రెడ్డి అనే పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమ వారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ అరూప కుమార్ గోస్వామి, న్యాయ మూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు ఉపక్రమించింది. మేనిఫెస్టో విడుదలై ఎస్ఈసీ స్పందించకపోతే తగిన వేదికను ఆశ్రయించాలని సూచించింది. ఈ అంశంపై పిల్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై మీకు అభ్యంతరం ఉంటే, నిబంధనలు మేరకు తగిన వేదికను ఆశ్రయించాలని కోర్టు పేర్కొంది. మ్యానిఫెస్టో ఉపసంహరించారని, కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాత్రం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ పిటీషన్ వాదించారు. అందుకే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చంద్రబాబు పై చర్యలు తీసుకోలేదు కాబట్టి, మీరు చర్యలు తీసుకోవాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు.

అయితే ఈ వాదన పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మ్యానిఫెస్టో ప్రచురణ చేసింది, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే, మీరు పదే పదే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేరు ఎందుకు చెప్తున్నారు అని వ్యాఖ్యానించిన కోర్టు, చంద్రబాబుని ప్రతివాదిగా చేర్చటం పై అసహనం వ్యక్తం చేసింది. ఈ పిల్ కు విచారణ చేసే అర్హత లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు అంటే, తగిన నిబంధనలు చూపించి, తగిన వేదికను ఆశ్రయించాలని హైకోర్టు పేర్కొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పంచ సూత్రాల పేరుతో, తెలుగుదేశం పార్టీ ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది. తాము బలపరిచిన అభ్యర్ధులు గెలిస్తే, ఏమి చేస్తామో చెప్పారు. అయితే, పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదని చెప్పిన వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో ని వెనక్కు తీసుకోవాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ మ్యానిఫెస్టో బయటకు రాలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read