ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు మరోసారి ప్రభుత్వం తీరు పై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు కూడా హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. కొన్ని నెలల క్రితం పర్మిషన్ తీసుకుని, విశాఖపట్నం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని, పోలీసులు అడ్డుకున్న కేసు, ఈ సందర్భంగా చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవటం, పోలీసులు నోటీసులు ఇవ్వటం, చంద్రబాబుని అక్కడ నుంచి పంపించటం, వీటి అన్నిటి పై, హైకోర్టులో ఒక కేసు నమోదు అయ్యింది. గతంలో ఇదే కేసులో డీజీపీని కూడా హైకోర్టు, కోర్టుకు పిలిపించి, సెక్షన్ ఏమిటో చదవండి అంటూ, చేసిన ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు మరోసారి హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, పిటీషనర్ తరుపు న్యాయవాది వేసిన అఫిడవిట్ లో, ప్రభుత్వానికి మతిలేని చర్య అంటూ, పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానిది మతిలేని చర్యగా పేర్కొనటం పట్ల, ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ వ్యాఖ్య పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే ఇదే సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, అమరావతి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మించిన రాజధానిని తరలించటం మతిలేని చర్య కాదా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇప్పుడు రాజధానిని మధ్యలో తరలించటం అనేది, ఏ విధంగా అర్ధం చేసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

hc 20112020 2

రాజధాని నిర్మాణాలు చూసిన ఎవరికైనా బాధ ఆవేదన కలుగుతుందని, హైకోర్టు ధర్మసానం వ్యాఖ్యానించింది. దీంతో పాటుగా, రాజధానికి సంబంధించి, ఇవి మీ డబ్బులు, మా డబ్బులు కావు, ఇవి ప్రజల డబ్బులు అనేవి గుర్తు పెట్టుకోవాలని, ఏ అధికారంతో రాజధానిని తరలిస్తున్నారో తెలుసుకొండి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది, ఇక్కడ ఎక్కువ ఖర్చు, అక్కడ తక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు ఇప్పటికే విచారణలో ఉంది కాబట్టి, దీని పై ఇక్కడ మాట్లాడవద్దు అని ప్రభుత్వం తరుపు న్యాయవాది సూచించారు. ఈ నేపధ్యంలోనే, రాజధాని ఇక్కడే ఉండాలని న్యాయవాది పేర్కొన్నారని, అందువల్లే దీని గురించి తాము వ్యాఖ్యానించామని ధర్మాసనం పేర్కొంది. ఇక దీంతో పాటుగా, రాజకీయాల్లో నేరప్రవృత్తి పెరిగిపోతున్న అంశం పై స్పందిస్తూ, ఇది మంచిది కాదని, వ్యవస్థలను పరిరక్షించుకోవాలన్నా, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగంలో ఉన్న హక్కులు పరిరక్షించుకావాలన్నా, ఈ రాజకీయాల్లో నేర నేరప్రవృత్తిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, ఇది అందరి మీద ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నేర చరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అవసరం ఉందని, నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటేనే వ్యవస్థలు అన్నీ కూడా సరిగ్గా పని చేస్తాయని, ధర్మాసనం వ్యాఖ్యానించింది

Advertisements

Advertisements

Latest Articles

Most Read