సరిగ్గా వారం క్రితం, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తాము ఒక విషయం చెప్తాము, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ ప్రకటన అందరూ చూడండి అంటూ మీడియాకు లీకులు ఇచ్చింది. అందరూ ఏమైనా కొత్త సంక్షేమ పధకమో, లేకపోతే భారీ పెట్టుబడి గురించి కానీ, లేక జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు కాబట్టి, స్పెషల్ స్టేటస్ గురించి చెప్తారేమో అని ఆశగా ఎదురు చూసారు. తీరా చూస్తే, ఆ ప్రకటనా న్యాయ స్థానాలు, హైకోర్టు జడ్జీలు, సుప్రీం కోర్టు జడ్జి పై, ఫిర్యాదు చేసిన విషయం. అది కూడా ఇంగ్లీష్ లో ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చి, లేఖ మీడియాకు విడుదల చేసి, తమను ఏ ప్రశ్నలు అడగ వద్దు అంటూ చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అజయ్ కల్లం రెడ్డి, మీడియా సమావేశం ముగించి వెళ్ళిపోయారు. అయితే దాని తరువాత ఈ విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ విషయం పై న్యాయస్థానాలు ఎలా రియాక్ట్ అవుతాయి, న్యాయమూర్తులు ఎలా రియాక్ట్ అవుతారు, అనే విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే వివిధ బార్ అసోసియేషన్ లు, వివిధ సీనియర్ అడ్వకేట్లు ఈ విషయం పై స్పందించారు. జగన్ పై ఘాటు విమర్శలు చేసారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, హైకోర్టు ఒక కేసు విషయంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అయినా ఆ గ్యాగ్ ఆర్డర్ కి విరుద్ధంగా, ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్ కానీ, లేఖ కాని ఉంది. అయితే ఈ విషయం పై హైకోర్టు కూడా స్పందించింది.

రాజధానికి సంబందించిన భూములు విషయంలో, ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ, కేసు వివరాలు కానీ మీడియాలో ప్రసారం చేయ కూడదు అని మేము ఆదేశాలు ఇస్తే, ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్ తో, అలాగే ముఖ్యమంత్రి రాసిన లేఖ బహిర్గతం చేయటంతో, మా ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయిందని, హైకోర్టు పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ సవరించాలని, ఆ కేసు విషయాలు తమకు తెలియలాని, మమతారాణి అనే న్యాయవాది ఈ కేసు విషయంలో అనుబంధ పిటీషన్ దాఖలు చేసారు. తమకు ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ వేసారు. ఈ అనుబంధ పిటీషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన అధిష్టానం, ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్, మీడియాకు ఇచ్చిన లేఖలతో, మేము ఇచ్చిన ఆదేశాలు ఉపయోగం లేకుండా పోయాయని, ఇంకా దీని పై ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని, ఈ అనుబంధ పిటీషన్ కూడా , మెయిన్ పిటీషన్ తో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇక పొతే, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీలో సోషల్ మీడియాలో పెడుతున్నారని, అవి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని, దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరుపు న్యాయవాది మరో అనుబంధ పిటీషన్ వేయాగా, ఇది కూడా అత్యవసర విచారణ అవసరం లేదని, సీరియల్ ప్రకారం బెంచ్ ముందుకు వస్తుందని కోర్టు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read