ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో పాలక మండలి నియామకాల తీరు పై, హైకోర్టు తీవ్రంగా స్పందించింది. యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు, రాజకీయా ప్రయోజనల కోసం, రాజకీయ సిఫారసులతో మాత్రమే నియామకాలు జరుగుతున్నాయని, హైకోర్టులో మాజీ జడ్జి జాడ శ్రవణ్ కుమార్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపధ్యంలో, ఈ పిటీషన్ పై నేడు ధర్మాసనం, విచారణ చేసింది. జస్టిస్‌ రాకేష్‌కుమార్‌, జిస్టిస్‌ ఉమాదేవి దర్మసానం ఈ కేసు విచారణ చేసింది. శ్రవణ్ కుమార్ తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూనివర్సిటీ పాలకమండలి నియామకాలు మొత్తం, రాజకీయ సిఫారుసలతో నియమించారని, దానికి సంబందించిన ఫైల్స్, ఆధారాలు అన్నీ కోర్టు ముందు ఉంచారు. అయితే దీని పై కోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయ జోక్యం, సిఫారుసు ఎక్కువ అయ్యింది అంటూ స్పందించింది. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యా మండలికి పంపిన ఫైల్, సిఫారుసు వివరాలు కూడా కోర్టు ముందు ఉంచారు. ఎవరు సిఫారుసులు చేసింది, లాంటి పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. మాములుగా యూనివర్సిటీ పాలకమండలి నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని కోర్టుకు తెలిపారు.

hc 09112020

అయితే దీని పై స్పందించిన కోర్టు, అసలు పాలకమండలి సభ్యులను ఏ అర్హతలతో నియమిస్తారు, వివిధ మార్గదర్శకాల వివరాలు ఇవ్వాలని, ధర్మాసనం కోరటంతో, ఈ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా పడింది. ఇక మరో అంశం పై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో శ్మశానంలో నిర్మిస్తున్న అనధికార నిర్మాణాల విషయమై హైకోర్టు సీరియస్ అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుమలాయపల్లిలో ప్రభుత్వమే అనధికార నిర్మాణాలు చేయటం పై కోర్టు సీరియస్ అయ్యింది. శ్మశానం దాని చుట్టూ పక్కలా, అనుమతులు లేకపోయినా సరే, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను నిర్మాణం చేస్తున్నారు. అయితే గతంలో దీని పై హైకోర్ట్ ఆదేశాలు ఉన్నా, వాటిని పాటించక్పోవటంతో హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీని పై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇక మరో పక్క అమరావతి రాజధాని పిటీషన్ రోజు వారీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అమరావతి అంశంపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ప్రధాన పిటిషన్ల పై విచారణను హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read